ముంబయి : స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలతో పాటు ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ లాంటి దిగ్గజ షేర్లు నష్టాల్లో ఉండటం సూచీలపై ప్రభావం చూపిస్తోంది. క్రితం సెషన్లో కొత్త గరిష్ఠాలను చేరుకున్నప్పటికీ.. నేడు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఉదయం 9.52 నిమిషాలకు సెన్సెక్స్ 266 పాయింట్ల నష్టంతో 49,317 వద్ద.. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా నష్టంతో 14,515 వద్ద కొనసాగుతున్నాయి.
భారతీ ఎయిర్టెల్, యూపీఎల్, టాటాస్టీల్, గెయిల్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి.
Tags :
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?