ఇంటర్నెట్ డెస్క్: థ్రిల్లర్ సినిమాల నిపుణుడు కె.వి.గుహన్ దర్శకత్వంలో మరో క్రైమ్థ్రిల్లర్ చిత్రం రాబోతోంది. కళ్యాణ్రామ్ హీరోగా ‘118’తో తెరకెక్కించి సత్తా నిరూపించుకున్నారాయన. ఈసారి సైబర్క్రైమ్ ఆధారంగా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేందుకు సిద్ధమయ్యారు. డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ(ఎవరు, ఎక్కడ, ఎందుకు) పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఈ సినిమా టీజర్ను సూపర్స్టార్ మహేశ్బాబు తాజాగా విడుదల చేశారు. టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టీజర్ సాగిందిలా.. ‘‘నలుగురు స్నేహితులు సరదాగా వీడియోకాల్ మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో ఒక్కసారిగా ఊహించని అంతరాయం. ఎవరో వాళ్ల కాల్ను హ్యాక్ చేశారు. వాళ్ల పాస్వర్డ్లు, ఇతర సమాచారం మొత్తం లాగేసుకున్నారు. అందులో హీరోహీరోయిన్లు ఏకాంతంగా మాట్లాడుకున్న సంభాషణలు కూడా ఉన్నాయి. ఇది కచ్చితంగా బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటూ ఓ డైలాగ్.. ఇంతకీ ఆ అటాక్ చేసింది ఎవరు.? వాళ్లు ఉండేది ఎక్కడ..? అసలు ఎందుకు ఇలా చేశారు..? అనేదే కథాంశం. ఫస్ట్లుక్ను రానా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రియదర్శి, రాజ్కుమార్ సతీష్, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాను డా.రవి, పి.రాజు దాట్ల నిర్మిస్తున్నారు. సిమన్ కె.కింగ్ సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
ఇదీ చదవండి..
భారీ బడ్జెట్తో ‘మణికర్ణిక’ సీక్వెల్
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
- ‘బిగ్బాస్’ కంటెస్టెంట్ హీరోగా కొత్త సినిమా!
-
రానా ‘అరణ్య’ ట్రైలర్
- పవన్ భార్యగా సాయిపల్లవి!
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
గుసగుసలు
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
రివ్యూ
ఇంటర్వ్యూ
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
నమ్మించి మోసం చేశారు: జయలలిత
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది