
తాజా వార్తలు
శంషాబాద్-చికాగో నాన్స్టాప్ విమాన సేవలు
హైదరాబాద్: హైదరాబాద్-అమెరికా మధ్య ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాన్స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. చికాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలిసారి నేరుగా వచ్చిన ఎయిర్ ఇండియా విమానం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంపట్ల అధికారులు, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
238 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో ఎనిమిది ఫస్ట్క్లాస్, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ సీట్లు ఉన్నాయి. వీటితోపాటు నలుగురు కాక్పిట్, 12 మంది క్యాబిన్ క్రీవ్ సిబ్బంది ఉన్నారు. విమానాన్ని నడిపిన నలుగురు పైలట్లను శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ఘనంగా సన్మానించారు.
ఇవీ చదవండి..
వ్యాక్సినేషన్.. ఈ రూల్స్ మర్చిపోవద్దు
Tags :