
తాజా వార్తలు
ఏపీలో కొత్తగా 94 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 31,696 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 94 కేసులు నిర్ధారణ కాగా.. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,85,710కి చేరింది. తాజా మరణాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,139 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 232 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,76,372కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,199 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,25,14,639 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
ఇవీ చదవండి..
ఏపీలో వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం
వ్యాక్సినేషన్.. ఈ రూల్స్ మర్చిపోవద్దు