
తాజా వార్తలు
పైసల్ తీసుకొని క్షమించారా..!
శ్వేతసౌధంపై ఆరోపణలు.. దర్యాప్తు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయం వీడే సమయంలో తీవ్రవిమర్శల పాలవుతున్నారు. డబ్బులు తీసుకొని అధ్యక్షుడు కొందరికి క్షమాభిక్షను ప్రసాదించారా అనే అంశంపై అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. ఈ విషయాన్ని ఆంగ్లపత్రిక ది గార్డియన్ పేర్కొంది. దీనిలోని వ్యక్తుల పేర్లను వెల్లడించకుండా పూర్తిగా ఎడిట్ చేసిన డాక్యుమెంట్ను బహిర్గతం చేశారు. దీనిలో అధ్యక్షుడు ట్రంప్ సహా మరే అధికారి పేరును పేర్కొనలేదు.
ఈ పత్రంలో చాలాకీలక అంశాలను ప్రస్తావించారు. ట్రంప్ ఆఫీస్ను వీడటానికి ముందే చాలా మందికి క్షమాభిక్ష ప్రసాదించే విషయాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులు లాబీయిస్టులా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. శ్వేతసౌధం మంజూరు చేసిన క్షమాభిక్షల్లో డబ్బుపాత్ర ఉందా అనే అంశంపై చేస్తున్న దర్యాప్తు ఏ అధికారిని ఉద్దేశించి కాదని జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ట్రంప్ దీనిపై తనదైన శైలిలో స్పందించారు. ‘క్షమాభిక్షలపై దర్యాప్తు ఓ ఫేక్ న్యూస్’ అని ఆయన మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇన్కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- ఫిట్గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- అరెరె షా.. రోహిత్కు కోపం తెప్పించేశావ్గా!
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్కు తెరదించిన శతాబ్ది రాయ్
- మెగా కాంపౌండ్లో మ్యూజికల్ నైట్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
