ప్రసవానంతర కుంగుబాటు మూడేళ్ల వరకూ!
కాన్పు తర్వాత చాలామంది మహిళలు కుంగుబాటుకు (పోస్ట్పార్టమ్ డిప్రెషన్) లోనవుతుంటారు. ఆందోళన, విచారం, నిద్ర పట్టకపోవటం, తమను తాము నిందించుకోవటం వంటి వాటితో
కాన్పు తర్వాత చాలామంది మహిళలు కుంగుబాటుకు (పోస్ట్పార్టమ్ డిప్రెషన్) లోనవుతుంటారు. ఆందోళన, విచారం, నిద్ర పట్టకపోవటం, తమను తాము నిందించుకోవటం వంటి వాటితో సతమతమవుతుంటారు. ఐదారు నెలల్లో చాలావరకివి తగ్గిపోతాయి గానీ కొందరిలో మూడేళ్ల వరకూ కొనసాగుతున్నట్టు తాజాగా బయటపడింది. గతంలో మూడ్ సమస్యల బారినపడ్డవారిలో ఇలాంటి ధోరణి ఎక్కువగా ఉంటోంది. లక్షణాలూ తీవ్రంగానే ఉంటున్నాయి. గర్భిణి మధుమేహం తలెత్తినవారికి దీని ముప్పు పెరుగుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రసవానంతర కుంగుబాటు లక్షణాలను బేరీజు వేయటానికి ఆరు నెలల సమయం సరిపోదని, తల్లుల మానసిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవటానికి దీర్ఘకాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’