PM Modi: విధ్వంసకర వినియోగం ఆపుదాం
తెలివితక్కువ, విధ్వంసకర వినియోగానికి వెంటనే ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పర్యావరణ అనుకూల జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, దీన్ని ప్రపంచ కార్యక్రమంగా
పర్యావరణ అనుకూల జీవనశైలిని అలవర్చుకుందాం
‘పారిస్ సదస్సు’ స్ఫూర్తితో భారత్ మున్ముందుకు
‘కాప్26’ సదస్సులో ప్రధాని మోదీ
గ్లాస్గో: తెలివితక్కువ, విధ్వంసకర వినియోగానికి వెంటనే ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పర్యావరణ అనుకూల జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, దీన్ని ప్రపంచ కార్యక్రమంగా మార్చాలని సూచించారు. సోమవారం ఆయన గ్లాస్గోలో ‘కాప్26’ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని అరికట్టేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలను, ఈ విషయంలో దేశ వైఖరిని ఆయన విస్పష్టం చేశారు.
‘‘నా దృష్టిలో పారిస్ వాతావరణ సదస్సు ఒక శిఖరాగ్ర సమావేశం కాదు. అదొక అంకితభావం. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను మనసా, వాచా, కర్మనా ఆచరిస్తున్న భారీ ఆర్థిక వ్యవస్థ భారత్ మాత్రమేనని ఇప్పుడు ప్రపంచమంతా అంగీకరిస్తోంది. పుడమి జనాభాలో 17% ఉన్న భారత్ది మొత్తం ఉద్గారాల్లో 5% వాటా మాత్రమేనని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల మనుగడకు వాతావరణ మార్పులు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. సవాళ్లు విసురుతున్నాయి. ఈ మార్పుల ప్రభావాలను నియంత్రించడంలో భారత్ శక్తికి మించి కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భరిస్తూనే ఉంది. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుంటూనే మా దేశం విధానాలను రూపొందించుకుంటోంది. 2030 నాటికి శూన్య ఉద్గార స్థాయికి చేరుకోవాలని భారతీయ రైల్వే సంకల్పించింది. అప్పటికి కార్బన్ ఉద్గారాలను 1 బిలియన్ టన్నుల మేర తగ్గిస్తాం. 2070 నాటికి భారత్ సున్నా ఉద్గారాల స్థాయిని అందుకుంటుంది. ఆ దిశగా శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించి, పునరుత్పాదక ఇంధన వాడకాన్ని పెంచుతున్నాం. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామన్న హామీలేవీ ఇంతవరకూ నెరవేరలేదు. ఈ విషయంలో విఫలమైన దేశాలపై ఒత్తిడి తేవాల్సిన తరుణమిది. భూతాపాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందిన దేశాలు వీలైనంత త్వరగా లక్ష కోట్ల డాలర్ల నిధులను సమకూర్చాలి’’ అని మోదీ పేర్కొన్నారు.
వాతావరణ సదస్సు వేదిక వద్ద బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఐక్యరాజ్య సమితి
సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్తో మోదీ మాటామంతీ
సర్దుబాటు చర్యలకు ప్రాముఖ్యత
అంతర్జాతీయ చర్చల్లో వాతావరణ మార్పులకు అనుగుణంగా జీవనాన్ని సర్దుబాటు చేసుకోవడానికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ప్రధాని మోదీ మరో కార్యక్రమంలో తెలిపారు. విపత్తుల అనంతరం ఉపశమనానికి తీసుకునే చర్యల స్థాయిలో దానిపై దృష్టి పెట్టడంలేదని ఆక్షేపించారు. దీనివల్ల దుర్బల దేశాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ‘‘ప్రకృతికి హాని తలపెట్టని రీతిలో జీవనాన్ని సాగించే సంప్రదాయ పద్ధతిపై అనేక జాతులకు మంచి అవగాహన ఉంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే మన విధానాల్లో ఇలాంటి వాటికి ప్రాముఖ్యత ఉండాలి. ఆ విజ్ఞానం భవిష్యత్ తరాలకు అందాలి. పాఠశాలల్లో పాఠ్యాంశంగా వాటిని బోధించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువగా సుమారు పది నిమిషాలు మాట్లాడిన మోదీ... ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమాపణలు కోరారు.
మోదీ-జాన్సన్ భేటీ
కాప్26 సదస్సు వేదిక వద్ద మోదీ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భేటీ అయ్యారు. హరిత హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనాలు, శుద్ధ పరిజ్ఞానం, ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగం వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ ఏడాది మే నెలలో రెండు దేశాల నేతలు నిర్వహించిన వర్చువల్ శిఖరాగ్ర సదస్సులో ఈ అంశంపై అవగాహన కుదిరిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి నిధుల సమీకరణ (క్లైమేట్ ఫైనాన్స్), పునరుత్పాదక ఇంధనాలు, అంతర్జాతీయ సౌర సంకీర్ణం (ఐఎస్ఏ), విపత్తులను తట్టుకొనే మౌలిక వసతుల సంకీర్ణం (సీడీఆర్ఐ) వంటి సంయుక్త కార్యక్రమాలపై బ్రిటన్తో కలిసి పనిచేస్తామని మోదీ చెప్పారు. భారత్ను సందర్శించాల్సిందిగా జాన్సన్ను మోదీ ఆహ్వానించారు. ఈ ఇద్దరు నేతల మధ్య ప్రత్యక్ష భేటీ జరగడం ఇదే మొదటిసారి.
ఇండియా గ్రీన్ గ్యారంటీ
భారత్లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 75 కోట్ల పౌండ్లను సమకూర్చుకునేందుకు బ్రిటన్ ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ని ఇస్తుంది. దీనివల్ల శుద్ధ ఇంధనం, రవాణా, పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో పర్యావరణ అనుకూల, దృఢ మౌలిక వసతులకు నిధులు లభిస్తాయి. దీనికితోడు ప్రైవేటు మౌలిక వసతుల అభివృద్ధి బృందం (పీఐడీజీ) ద్వారా వర్ధమాన దేశాల్లో పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు 21 కోట్ల డాలర్ల పెట్టుబడులకూ బ్రిటన్ సమ్మతించింది. దీనికింద భారత్లో విద్యుత్ వాహనాల ప్రాజెక్టులకూ నిధులు అందుతాయి.
ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
ఐరాస వాతావరణ సదస్సు ‘కాప్26’లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోమ్ నుంచి సోమవారం ఉదయం గ్లాస్గో చేరుకున్నారు. గ్లాస్గోలో స్కాట్లాండ్ బ్యాగ్పైపర్లు బాణీలను ఆలపిస్తూ ఆయనకు స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో భారత సంతతి ప్రజలు ఆయనను చూసేందుకు వచ్చారు. ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. గ్లాస్గో, ఎడిన్బరోకు చెందిన భారత సంతతి ప్రతినిధులు మోదీతో భేటీ అయ్యారు. వీరిలో ప్రముఖ వైద్యులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ తన శిలా ప్రతిమను ఆవిష్కరించారు. హకీం అనే ప్రవాస భారతీయ వైద్యుడు దీన్ని ప్రధానికి బహుకరించారు. ఈ విగ్రహానికి పెట్టడం కోసం ప్రధాని తన కళ్లద్దాలను ఇచ్చారు. బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ విలియమ్ నిర్వహించిన ‘ఎర్త్ షార్ట్ ప్రైజ్’ విజేత, దిల్లీకి చెందిన రీసైక్లింగ్ సంస్థ టకాచార్ వ్యవస్థాపకుడు విద్యుత్ మోహన్, సౌర శక్తితో నడిచే ఇస్త్రీ బండిని రూపొందించిన 14 ఏళ్ల తమిళనాడు బాలిక వినిషా ఉమాశంకర్లను కలుసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం