Pawan kalyan: శ్రమదానం స్ఫూర్తిని కొనసాగించండి
జనసేన చేపట్టే ఏ కార్యక్రమమైనా సామాన్య ప్రజల కష్టాలు, వారు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లు దూరం చేసేలా ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. పార్టీ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా.. మొదట
ఏ ప్రాంతంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా అక్కడ ఉండే ఓ రోడ్డుకు మరమ్మతులు చేయండి
జిల్లా అధ్యక్షుల సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్
ఈనాడు, అమరావతి: జనసేన చేపట్టే ఏ కార్యక్రమమైనా సామాన్య ప్రజల కష్టాలు, వారు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లు దూరం చేసేలా ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. పార్టీ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా.. మొదట ఆ ప్రాంతం పరిధిలో దెబ్బతిన్న ఒక రోడ్డును గుర్తించి దానికి మరమ్మతులు చేయాలని సూచించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన వివిధ జిల్లాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల సమస్యపై ప్రజాస్వామ్య పద్ధతిలో తొలుత అందరి దృష్టికి తీసుకెళ్లాం. మరమ్మతులకు తగిన గడువు ఇచ్చాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. జనసేన పార్టీ శ్రమదానం ద్వారా వాటికి మరమ్మతులు చేపడితే ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ప్రజలందరూ చూశారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన లభించింది. ఇకపై కూడా ఈ శ్రమదానం స్ఫూర్తి కొనసాగించాలి. సగటు మనిషి అభివృద్ధి తద్వారా రాష్ట్రాభివృద్ధి జనసేన లక్ష్యం. మనం ప్రజాపక్షం వహిస్తున్నాం. ఎవరికీ భయపడేది లేదు. ఏ అంశాన్ని అయినా ప్రజాకోణంలోనే విశ్లేషించి వారికి అండగా నిలుద్దాం. ప్రతి జిల్లాలో నేను పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా. జిల్లాకు వెళ్లినప్పుడు అక్కడ పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తా...’ అని పేర్కొన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ శ్రేణుల్ని జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం అనుసంధానం చేసుకోవాలని, పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్ని ప్రభావవంతంగా నిర్వహించాలని చెప్పారు. పార్టీ మండల, గ్రామ కమిటీల నియామకానికి సూచనలు, సలహాలు ఇచ్చారు.
నవంబరు 15 నాటికి మండల కమిటీల నియామకం పూర్తి
జిల్లా అధ్యక్షులు, కమిటీల నియామకం పూర్తయిన జిల్లాల్లో నవంబరు 15వ తేదీ నాటికి మండల పార్టీ అధ్యక్షులు, మండల కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సమీక్ష కొనసాగింది. అనంతరం వివిధ జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు టి.సి.వరుణ్, షేక్ రియాజ్, పోతిన వెంకట మహేష్, మనుక్రాంత్రెడ్డి, తదితరులతో కలిసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని ఆయన వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి ప్రతి డివిజన్, వార్డుల్లో పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టాలని తీర్మానించాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇసుక తవ్వకాలు, అక్రమ మైనింగ్, పోలీసు శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించాం. వైకాపా అధికారం చేపట్టిన తర్వాత చిన్న వినతిపత్రం తీసుకోవడానికి కూడా పోలీసులు ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాం. జిల్లాల వారీగా ప్రత్యేకంగా ఉన్న సమస్యలపై జనసేన శ్రేణులు పోరాటం చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గానికి పంపించాలని అధ్యక్షుడు మాకు సూచించారు. పార్టీ క్రియాశీలక సభ్యుల్ని బలోపేతం చేసే దిశగా వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం....’ అని కందుల దుర్గేష్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు