Lakhimpur Kheri Case: ఈ జాప్యం ఉద్దేశపూర్వకం అనిపిస్తోంది
ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ఖేరి ఘటన దర్యాప్తు తీరుపట్ల సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రస్తుత పరిస్థితులను బట్టిచూస్తే ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు అనిపిస్తోందని, ఆ అభిప్రాయాన్ని మార్చేలా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించింది
ఆ అభిప్రాయం ముందు పోగొట్టండి
లఖింపుర్ ఖేరి కేసులో నిలదీసిన సుప్రీంకోర్టు
విచారణ అంతులేని కథలా సాగకూడదు
బాధితులకు, సాక్షులకు భద్రత కల్పించండి: సీజేఐ జస్టిస్ రమణ
ఈనాడు, దిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ఖేరి ఘటన దర్యాప్తు తీరుపట్ల సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రస్తుత పరిస్థితులను బట్టిచూస్తే ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు అనిపిస్తోందని, ఆ అభిప్రాయాన్ని మార్చేలా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించింది. సాక్షుల నుంచి సెక్షన్-164 కింద వాంగ్మూలాల నమోదును వేగవంతం చేయాలని, వారికి తగిన భద్రత కల్పించాలని ఆదేశించింది. అక్టోబరు 3న జరిగిన ఘటనలో కేంద్ర మంత్రి అజయ్మిశ్ర కుమారుడు ఆశీష్ మిశ్ర వాహనాలు దూసుకెళ్లడం వల్ల నలుగురు రైతులు మృతి చెందడం, అనంతరం జరిగిన ప్రతీకార హింసలో మరో నలుగురు చనిపోయిన ఘటనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరఫున స్థాయీ నివేదికను సీనియర్ న్యాయవాది హరీశ్సాల్వే సమర్పించారు. 44 మంది సాక్షుల్లో నలుగురి వాంగ్మూలాలను సెక్షన్-164 కింద జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేశామని చెప్పారు. ‘మిగిలిన సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. నిందితుల పట్ల అధికారులు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారన్న భావన ధర్మాసనం నుంచి ఇదివరకు వ్యక్తమైంది. ఇప్పుడు అందర్నీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు’ అని వివరించారు. ఇంతవరకు పదిమందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఘటన సమయంలో పెద్దసంఖ్యలో రైతుల గుంపు ఉన్నందున ఎవరేం చేశారన్న అంశంపై విచారణ చేపట్టడం కష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
రెండుగా విభజించి విచారించండి: సీజేఐ
యూపీ వాదనపై సీజేఐ స్పందిస్తూ.. రైతులపైకి వాహనం నడపడం, ఆ తర్వాత రైతులు కొందర్ని కొట్టి చంపడం అనే రెండు కేసులను విభజించి, వేర్వేరుగా విచారణ చేపట్టాలని సూచించారు. స్థాయీ నివేదిక కోసం మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు తాము ఎదురుచూసినా రాలేదని, కేసు విచారణకు ముందు సీల్డ్ కవర్లో అందించారని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు, అరెస్టులు వంటి అంశాలపై వాదప్రతివాదనలు జరిగాయి. ఒక దశలో జస్టిస్ రమణ స్పందిస్తూ ‘ఇది అంతులేని కథలా ఉండకూడదు’ అన్నారు. జ్యుడీషియల్ కస్టడీలో, పోలీసు కస్టడీలో ఎంతమంది ఉన్నారో తెలియాలని, వారందర్నీ విచారిస్తే గానీ పోలీసులకు సమాచారం రాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారం వ్యవధి ఇస్తే కేసు తాజా పరిస్థితి వివరిస్తామని హరీశ్సాల్వే చెప్పారు. సాక్షులందరి వాంగ్మూలాలు తీసుకోవాలని.. వారికి, బాధితులకు భద్రత కల్పించాలని సీజేఐ ఆదేశించారు. తదుపరి విచారణను 26కువాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.