Zero interest: 0 వడ్డీ చిక్కిపోయింది
సున్నా వడ్డీ పంట రుణాల పథకం చిక్కిపోతోంది. 2020 ఖరీఫ్లో 11 లక్షల మంది రైతులు రూ.లక్ష లోపు రుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లించారని బ్యాంకులు జాబితా ఇవ్వగా..
2019 ఖరీఫ్తో పోల్చితే మూడో వంతూ లేదు
7.91 లక్షల మంది.. రూ.393 కోట్లు తగ్గుదల
ఈ-పంట నిబంధనతో తగ్గిన సంఖ్య
ఈనాడు - అమరావతి
సున్నా వడ్డీ పంట రుణాల పథకం చిక్కిపోతోంది. 2020 ఖరీఫ్లో 11 లక్షల మంది రైతులు రూ.లక్ష లోపు రుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లించారని బ్యాంకులు జాబితా ఇవ్వగా.. వారిలో 6.67 లక్షల మందికి మాత్రమే రూ.112.70 కోట్లు విడుదలైంది. 2019 ఖరీఫ్లో సున్నా వడ్డీకి విడుదలైన మొత్తంతో పోలిస్తే.. ఇది రూ.393 కోట్లు తక్కువ. అర్హుల సంఖ్యా 7.91 లక్షలు తగ్గింది. ఈ-పంటలో పేర్లు నమోదు చేసుకోలేకపోవడంతో మిగిలిన రైతులు అర్హత సాధించలేకపోయారని వ్యవసాయశాఖ చెబుతోంది. అనంతపురం జిల్లాలో గతేడాదితో పోలిస్తే లబ్ధిదారులు 1.57 లక్షల మంది తగ్గారు. చిత్తూరు జిల్లాలో 2019 ఖరీఫ్లో 32,278 మందికి సున్నా వడ్డీ వర్తింపజేయగా... 2020 ఖరీఫ్లో ఆ సంఖ్య 8,365కి తగ్గింది. నెల్లూరు జిల్లాలో 2019 ఖరీఫ్లో రూ.4.84 కోట్లు ఇస్తే.. 2020 ఖరీఫ్లో రూ.1.23 కోట్లకే పరిమితమైంది. కర్నూలు జిల్లాలోనూ సగానికి సగం తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
సున్నా వడ్డీ లెక్కింపు ఇలా..
పంట రుణంపై బ్యాంకులు 7% వడ్డీ వసూలు చేస్తాయి. రూ.లక్ష రుణం తీసుకుంటే ఏడాదికి రూ.7 వేలు వడ్డీ అవుతుంది. ఇందులో కేంద్రం ఇచ్చే వడ్డీ రాయితీగా 4% మినహాయిస్తారు. కొన్ని బ్యాంకులు ముందే వసూలు చేసుకుని తర్వాత రైతు ఖాతాకు జమ చేస్తాయి. అంటే రైతు రూ.లక్షకు ఏడాదికి రూ.3 వేలు చెల్లించాలి. రైతులు ముందు చెల్లిస్తే.. తర్వాత వారి ఖాతాలకు జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ-పంట ఆధారంగానే సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేయాలని నిర్ణయించింది. రైతు రుణం తీసుకుని ఏడాదిలో చెల్లించినట్లు బ్యాంకులు ధ్రువీకరించినా సరే.. ఈ-పంటలో ఆయన పేరు లేకపోతే సున్నా వడ్డీ అందదు. దీంతో పలువురు అర్హత సాధించలేకపోయారు. ‘సహకార పరపతి సంఘం నుంచి రూ.లక్ష రుణం తీసుకుని ఏడాదిలోగానే చెల్లించాం. సున్నా వడ్డీ జమ కాలేదు’ అని నెల్లూరు జిల్లా చేజర్ల రైతు జి.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా లక్ష్మమ్మాపురం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం నాయుడు.. గతేడాది ఖరీఫ్లో రూ.99 వేల రుణం తీసుకున్నారు. ఏడాదిలోపే చెల్లించారు. వ్యవసాయ సిబ్బంది వచ్చి ఈ-క్రాప్ నమోదు చేసుకుని వెళ్లారని, అయినా సున్నా వడ్డీ పడలేదన్నారు.
ఈ-పంటలో పేరు లేకుంటే సున్నా వడ్డీ రాదు
- అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ
ఈ-పంటలో పేరు లేదంటే ఆ రైతు వ్యవసాయం చేయడం లేదని, తీసుకున్న రుణాన్ని సాగుకు వాడలేదని భావించి సున్నా వడ్డీ వర్తింపజేయరు. 2019 ఖరీఫ్లో ఈ-పంట నిబంధనకు సడలింపు ఇవ్వడంతో ఎక్కువ మందికి సున్నా వడ్డీ అందింది. 2020 ఖరీఫ్ నుంచి ఈ నిబంధన కచ్చితంగా అమలవుతుంది. రుణం తీసుకున్న పంట, నమోదైన పంట వేర్వేరుగా ఉన్నా సున్నా వడ్డీ రాదు. ఇలాంటి వారికి ఈ ఏడాదికి వెసులుబాటు కల్పించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.