AP News: దెబ్బతిన్న పంటలకు రబీలోగా పరిహారం
ప్రస్తుతం కురుస్తున్న భారీవర్షాల కారణంగా రైతులు ఎంత నష్టపోయారో గుర్తించి... రబీ ముగిసేలోగానే నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడి
గులాబ్ తుపాను బాధిత రైతులకు పెట్టుబడి రాయితీ విడుదల
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పెట్టుబడి రాయితీ చెక్కును విడుదల చేస్తున్న
సీఎం జగన్, చిత్రంలో మంత్రి కన్నబాబు తదితరులు
ఈనాడు, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న భారీవర్షాల కారణంగా రైతులు ఎంత నష్టపోయారో గుర్తించి... రబీ ముగిసేలోగానే నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో... 2021 ఖరీఫ్లో గులాబ్ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన 34,586 మంది రైతుల ఖాతాల్లోకి రూ.22 కోట్ల పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ జమ చేశారు. ‘18 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి 13.96 లక్షల మంది రైతులకు ఈ రెండున్నరేళ్లలో రూ.1,071 కోట్లను పెట్టుబడి రాయితీగా అందించాం. ఏ సీజన్లో పంట దెబ్బతింటే అదే పంటకాలంలో సొమ్ము జమ చేస్తున్నాం. పారదర్శకత కోసం గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ చేసి.. జాబితాలను ప్రదర్శిస్తున్నాం. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం’అని పేర్కొన్నారు.
‘వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.18,777 కోట్లను నేరుగా రైతుల చేతుల్లో పెట్టాం. సున్నా వడ్డీ కింద రూ.1,674 కోట్లు ఇచ్చాం. ఉచిత పంటల బీమా కింద రూ.3,788 కోట్లు ఇచ్చాం. పగటిపూట నాణ్యమైన విద్యుత్తు కోసం రూ.18 వేల కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్తు రాయితీగా రూ.1,520 కోట్లు ఇచ్చాం. పొలాలకు 9 గంటల ఉచిత విద్యుత్తును ఇవ్వడానికి ఫీడర్ల ఏర్పాటుకు రూ.1,700 కోట్లు పైగా ఖర్చు చేశాం’ అని సీఎం వివరించారు.
రూ.35 వేల కోట్లతో ధాన్యం సేకరణ
‘ధాన్యం సేకరణకు రూ.35వేల కోట్లు, పత్తి కొనుగోలుకు రూ.1,800 కోట్లు, ఇతర పంటల కొనుగోలుకు రూ.6,430 కోట్లను వెచ్చించాం. రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం’ అని తెలిపారు. ‘రైతుకు సమీపంలో... అదే గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు ఉన్నాయి. ‘ఆర్బీకే స్థాయి నుంచి వ్యవసాయ సలహామండళ్లను ప్రారంభించాం. ప్రతినెలా మొదటి శుక్రవారం ఆర్బీకే, రెండో శుక్రవారం మండల, మూడో శుక్రవారం జిల్లాస్థాయిలో కలెక్టర్ల వద్ద వీటి సమావేశాలు జరగాలి. ఈ సందర్భంగా ప్రస్తావించే రైతు సమస్యలను కలెక్టర్లు పరిష్కరించాలి. రాష్ట్రస్థాయిలో చేయాల్సిన వాటిని విభాగాధిపతులు, వ్యవసాయశాఖ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలి’ అని నిర్దేశించారు.
50 రోజుల్లోనే పరిహారం
‘సెప్టెంబరులో గులాబ్ తుపాను వచ్చి పంటనష్టం జరిగితే... 50 రోజుల్లోపే పరిహారం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మంగళవారమే డబ్బు జమ అవుతుందని రైతులు కూడా ఊహించి ఉండరు’ అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. అండగా ఉంటామని రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా.. సంస్కరణల ద్వారా వ్యవసాయరంగ పురోగతికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
ధాన్యం బస్తా రూ.1,450 చొప్పున కొంటున్నారు
ఈ సందర్భంగా పలువురు రైతులు సీఎం జగన్మోహన్రెడ్డితో మాట్లాడారు. తనకు రూ.14వేల పెట్టుబడి రాయితీ అందిందని తాడేపల్లిగూడెం మండలం మాధవరం రైతు ధన్రాజ్ పేర్కొన్నారు. ప్రభుత్వం బస్తా రూ.1,450 చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. కౌలు రైతునైన తనకు రూ.10,500 పెట్టుబడి రాయితీ అందిందని, డీసీసీ బ్యాంకులో అయిదుగురు సభ్యుల సంఘానికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున రుణం ఇస్తామన్నారని అనకాపల్లికి చెందిన కౌలు రైతు మహాలక్ష్మీనాయుడు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.