Ap news: డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్నాం
‘ఒక బాధ్యతాయుతమైన రాజకీయపార్టీగా మేము డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ను ఆకాంక్షిస్తున్నాం. గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాల ముప్పుపై కేంద్ర ప్రభుత్వంతో పాటు పౌర సమాజాన్ని
మాదకద్రవ్యాల ముప్పుపై అప్రమత్తం చేస్తున్నాం
కేసీఆర్ వ్యాఖ్యలు సీఎం జగన్కు సిగ్గుచేటు
చంద్రబాబు వ్యాఖ్యలు
ఈనాడు, దిల్లీ: ‘ఒక బాధ్యతాయుతమైన రాజకీయపార్టీగా మేము డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ను ఆకాంక్షిస్తున్నాం. గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాల ముప్పుపై కేంద్ర ప్రభుత్వంతో పాటు పౌర సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నాం...’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్లే ముందు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ నివాసంలో మీడియాతో మంగళవారం ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం ఓ రాజకీయపార్టీగా తమ బాధ్యతని, అందుకే దిల్లీ వచ్చామన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా చిరునామాగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని, దీనిపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. మాదకద్రవ్యాలకు అలవాటైన పిల్లలు, యువకులు ఆ వ్యసనం నుంచి బయటపడలేరని, వారి జీవితం అక్కడితో ముగిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు వ్యవస్థను విధ్వంసం చేసే ఆలోచన ఎవరూ చేయలేదు
తమ దగ్గర పార్టీ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారని, కరెంటు కోతలు, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్కు సిగ్గుచేటని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయడం లేదని, వచ్చిన పన్నులను ఆన్లైన్ ద్వారా బదిలీ చేయడం తప్ప ఏం చేయడం లేదన్నారు. సంపద సృష్టించలేని ప్రభుత్వాలు అవసరం లేదని ఓ ఆర్థిక నిపుణుడు వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. ‘సైబరాబాద్ నిర్మాణం తెలంగాణకు బంగారు గనిగా మారింది. దానికి మరింత అడ్వాన్సుడుగా అమరావతిలో నవ నగరాలకు ప్రణాళిక వేశాం. అవి పూర్తయితే రాష్ట్రానికి పెద్ద ఎత్తున రాబడి వచ్చేది. హైదరాబాద్కు మించిన రింగు రోడ్డు నిర్మాణాన్ని అమరావతిలో ప్రతిపాదించాం...’ అని ఆయన వివరించారు. ‘నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, జీనోమ్వ్యాలీ వంటి అనేక పనులను ఆ తర్వాత ముఖ్యమంత్రులైన రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి, తెలంగాణ వచ్చాక కేసీఆర్ కొనసాగించారు. రాజకీయంగా అప్పుడూ విమర్శలు, ప్రతి విమర్శలు ఉన్నా వ్యవస్థను విధ్వంసం చేసే ఆలోచన ఎవరూ చేయలేదు. అందుకే కోకాపేటలో ఒకప్పుడు రూ.20 వేలు పలికిన ఎకరం ఇటీవల రూ.40 కోట్లు పలికింది...’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి రైతులకు అండగా చట్టం
అమరావతిలో రాజధానికి సేకరించిన భూముల్లో అన్ని నిర్మాణాలు పోనూ పది వేల ఎకరాలు మిగిలేది. దానిని విక్రయిస్తే రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్ల వరకు రాష్ట్రానికి ఆదాయం వచ్చేది...’ అని చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణానికి సీఆర్డీఏ ఆధారంగా రైతులు భూములు ఇచ్చారని, వారికి అండగా చట్టం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజధాని మార్చాలంటే ఆ చట్టం ప్రకారం రైతులందరికీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. మారిస్తే అక్కడి రైతులు మాత్రమే నష్టపోరని.. సరైన రాజధాని నగరం, అభివృద్ధి లేక ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం పడుతుందన్నారు.
భవిష్యత్తులో ఆ అప్పులు కట్టక తప్పదు
రాష్ట్రంలో మద్యం, పెట్రోల్ ధరలు ఎక్కువ అవడంతో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దుల్లోని ప్రజలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి వాహనాలకు పెట్రోల్ పోయించుకొని అక్కడే మద్యం తాగి వస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ‘మద్య నిషేధానికి లాక్డౌన్కు మించిన అనువైన సమయం ఉండేది కాదు. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం రానున్న 25 ఏళ్ల పాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.75 వేల కోట్ల రుణాలు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో ఎవరూ అధికారంలో ఉన్నా ఆ అప్పులు కట్టక తప్పదు...’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సరిహద్దులకు దూరంగా ఉన్న ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లలేక, ఇక్కడ మద్యం తాగలేక అక్రమంగా మద్యం తయారు చేసుకుంటున్నారని, గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలకు అలవాటవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎప్పుడూ చూడని అరాచకాలు
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని అరాచకాలు చూస్తున్నామని చెప్పారు. ‘తెదేపా నాయకులు, కార్యకర్తలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా హింసలకు గురిచేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలపై పలు రకాల కేసులు మోపి పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పడంతో పాటు చిత్రహింసలు పెడుతున్నారు. డీజీపీ రాజకీయ ఉగ్రవాదానికి పూర్తిగా కొమ్ముకాస్తున్నారని’ ఆయన ధ్వజమెత్తారు.
పార్టీని పటిష్ట పరుస్తున్నాం
అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టి పార్టీపై పెద్దగా శ్రద్ధ పెట్టని మాట వాస్తవమేనని చంద్రబాబు వెల్లడించారు. ‘ప్రస్తుతం పార్టీపై దృష్టి పెట్టాం. అనుభవజ్ఞులు, సీనియర్లను గౌరవిస్తూనే చురుకైన యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాం. సుమారు పది పదిహేను నియోజకవర్గాల్లో ఇన్ఛార్జుల నియామకాల్లో కొంత పోటీ నెలకొంది. దానిపై దృష్టి పెట్టి త్వరలోనే ఇన్ఛార్జులను నియమిస్తాం. పార్టీని మరింత పటిష్ట పరుస్తాం. పొత్తులతోనే గెలుపు వస్తుందని అనుకోవడం లేదు. పొత్తులున్నప్పుడు గెలవడంతో పాటు ఓడిపోయాం...’ అని పేర్కొన్నారు.
* మంగళవారం రాత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు