Chandrababu: గ్రీజే పెట్టలేరు!
ప్రభుత్వ వైఫల్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగి గ్రామాలు కొట్టుకుపోయాయన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. ఈ ప్రాజెక్టు
అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు ఏడాదైనా మరమ్మతులు చేయించలేదు
షెకావత్ వ్యాఖ్యలకు సీఎం సమాధానం చెప్పాలి
సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి
చంద్రబాబు డిమాండ్
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ వైఫల్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగి గ్రామాలు కొట్టుకుపోయాయన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. ఈ ప్రాజెక్టు గేటుకు గ్రీజు వేయలేని, ఏడాదైనా మరమ్మతు చేయించలేని.. ఈ ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతారంట అని విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఒకరిని చంపితే హత్యాయత్నం కేసు పెడతారు.. అన్నమయ్య ప్రాజెక్టులో 45 మందిని బలిగొంటే మీ మీద కేసుల్లేవా?
చట్టపరమైన చర్యల్లేవా?’ అని నిలదీశారు. ‘సీఎం చేతగానితనం కారణంగానే వరదల వల్ల రూ.6వేల కోట్ల ఆస్తి నష్టం, 62 మంది ప్రాణాలు పోయాయి. ఇందుకు ఆయనే బాధ్యుడు. ఆయన్ను రాజీనామా చేయమన్నా.. పదవికి అర్హత లేదన్నా అవి తక్కువ మాటలే...’ అని మండిపడ్డారు. సమగ్ర న్యాయవిచారణ చేయించాలని, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెల్లించాలని, ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండు చేశారు.
కేంద్ర మంత్రి షెకావత్కే ఏం తెలియదంటారా?
అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర మంత్రి షెకావత్ వివరాలు వెల్లడిస్తే...‘ముంచేసింది కాక.. సిగ్గులేకుండా ఎదురుదాడికి దిగుతారా? ఆయనకు ఏమీ తెలియదంటారా...’ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? మీపై కేసులు ఉండవా?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్ రాజ్యసభలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ను ప్రదర్శించారు.అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... తిరుపతిలో తుమ్మలగుంట చెరువును స్టేడియంగా మార్చడంతో వరద ప్రవాహం పద్మావతి విశ్వవిద్యాలయం, రైల్వేస్టేషన్ దిగువ భాగంలో ప్రవహించడంతో 14 అడుగుల ఎత్తులో నీరు నిలిచిందని చెప్పారు. రాయలచెరువు లీకేజీని అరికట్టడంలో నిర్లక్ష్యం చేశారన్నారు. నెల్లూరు జిల్లా పెన్నానదిలో ఇసుక తవ్వకాల కారణంగా పొర్లు కట్టలు బలహీనపడడంతో రూ.2వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని, వేల కుటుంబాలు తమ సర్వస్వాన్ని కోల్పోయాయని చెప్పారు. సీఎం ఇప్పుడొచ్చి పొర్లుకట్ట కోసం వంద కోట్లు ఖర్చు పెడతామని, తానొచ్చి శంకుస్థాపన చేస్తానంటున్నారన్నారు. శ్మశానానికి శంకుస్థాపన చేస్తారా అని చంద్రబాబు నిలదీశారు.
వీసీని చూస్తే జాలేస్తోంది
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతిని చూస్తే జాలేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఎందుకు ఆ పదవి? రాజీనామా చేసి ఇంటికి పోయిండొచ్చు.. వేధింపులతో కళ్లనీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఆయనో అసమర్థ వ్యక్తిగా మిగిలిపోతారు. జీవితాంతం అంతర్మథనం చెందుతారు...’ అని చెప్పారు. ‘ఉద్యోగులు పైసా, పైసాగా దాచుకున్న వాటితో పాటు విద్యార్థుల సొమ్ము తదితరాలు కలిపి రూ.400 కోట్లు ఉంటే వాటిపైనా కన్నేస్తారా?’ అని నిలదీశారు.
సీఎం జగన్ కడప పర్యటన సందర్భంగా వరద బాధితులను అధికారులతో భయపెట్టించి.. పోలీసు కేసులు పెడతామని బెదిరించి.. బయటకు రాకుండా చేశారు. బాధితుల కంటే ఎక్కువ మంది పోలీసులను మోహరించారు. ఇది ఓదార్పు అవుతుందా? పరామర్శకు వెళ్లిన సీఎంతో ఒక ముసలావిడ నవ్వుతూ మాట్లాడుతోంది.. అంతా బాగుందంటూ వరదను స్వాగతించింది. ఎక్కడైనా ఇలా జరుగుతుందా? 62 మంది చనిపోతే ఆ బాధ అక్కడి వారిలో ఉండదా? బయట నుంచి జనాలను తెచ్చారు. అదీ జగన్ మార్కు రాజకీయం.
- విలేకరుల సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం
ఉన్నట్టుండి అన్ని నీళ్లు పడితే ఇంకేంది బతికేది
అన్నమయ్య ప్రాజెక్టు వరద గ్రామాలపైకి వస్తున్న సమయంలో స్థానికులు తీవ్ర ఆందోళనతో మాట్లాడుకున్న వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు. అందులో ఒక వీడియోలో... ‘నరసింహా.. పాయె నరసింహా? ఇల్లు ఒక్కటుండదు.. ఇల్లు పోయింది (రెండు సెకన్లలోనే).. ఉన్నట్టుండి అన్ని నీళ్లు పడితే ఇంకేంది బతికేది.. ఆవులు చచ్చిపోతాయి నరసింహా?’ అని ఒక బాధితుడు తన ఆందోళనను వ్యక్తం చేశారు. ‘చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు. దాని కోసం నదిలోకి లారీలు వెళ్తాయి. గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయనే ఉద్దేశంతోనే అవి బయటకు వచ్చే వరకు డ్యాం గేట్లు ఎత్తనీయకుండా ఆపారు...’ అని మరికొందరు ఆరోపించారు. వరదల అనంతరం ఎగువమందపల్లికి చెందిన వెంకటసుబ్రమణ్యం మాట్లాడుతూ...‘‘సార్, గేట్లు ఎత్తమని.. ఏఈ, డీఈని ఫోన్ చేసి అదే పనిగా అడిగాం. ఇబ్బంది పడతామని వారికి చెప్పినా ‘నాకు తెలుసు.. నాకు తెలుస’ని అన్నారు ఇసుక రవాణాకు వందకు పైగా లారీలు ఉన్నాయి. నీరు విడుదల చేస్తే అవి కొట్టుకుపోతాయనే ఇలా చేశారు..’’ అని పేర్కొన్న వీడియోను ప్రదర్శించారు. కొన్ని సంఘటనలను చంద్రబాబు వివరిస్తూ... ‘ముందస్తు హెచ్చరికల్లేకుండా నీటిని విడుదల చేయడంతో ఒక పూజారి కుటుంబంలో అతడి కళ్ల ముందే తొమ్మిది మంది చనిపోయారు. అదే గ్రామంలో ఒక యువకుడు ఇంటి సీలింగ్కు ఉండే ఇనుప కొక్కీని ముప్పావు గంట నుంచి గంట వరకు పట్టుకొని... తొమ్మిది మందిని తన భుజం, కాళ్లపై ఎక్కించుకున్నారు. వారిలో ఇద్దరు శ్వాస ఆడక.. ఆయన భుజంపైనే చనిపోయి కిందపడిపోయారు. ఏడుగురిని కాపాడగలిగారు. ఆయన ధైర్యం, సమయస్ఫూర్తి, వారి ప్రాణాల్ని కాపాడింది. ఒక గ్రామ సర్పంచి.. వరదొస్తోందని బయటికొచ్చి ఊరంతా చెప్పారు. ఆయన ఇంట్లోకి నీరొచ్చేసింది. ఇంటికొచ్చి చూసేసరికి ముగ్గురు కొట్టుకుపోయారు....’ అని పేర్కొన్నారు.
‘చచ్చిపోతున్నాం.. ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి..?
‘చచ్చిపోతున్నాం.. ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి..? ఎందుకు మాకీ బాధలు ఎందుకు?’ అంటూ ఓటీఎస్ చెల్లింపులపై ఒక మహిళ కన్నీటి పర్యంతమవుతూ... తీవ్ర ఆవేదనతో మాట్లాడుతున్న వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి, సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు