Lakhimpur Kheri: మిగతా కేసుల్లోనూ నిందితులతో ఇలాగే వ్యవహరిస్తారా?
లఖింపుర్ ఖేరిలో గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 8 మంది మరణానికి కారణమైన నిందితుల పట్ల ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ వ్యవహారశైలి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.
యూపీ సర్కారు నుంచి మాటలే తప్ప చర్యలు లేవు
‘సిట్’లో అందరూ స్థానిక అధికారులేనా!
అన్నింటికీ సీబీఐ విచారణే పరిష్కారం కాదు
లఖింపుర్ ఖేరి కేసులో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
ఈనాడు, దిల్లీ: లఖింపుర్ ఖేరిలో గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 8 మంది మరణానికి కారణమైన నిందితుల పట్ల ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ వ్యవహారశైలి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ‘దయచేసి విచారణకు హాజరుకండి’ అంటూ నిందితుడికి సీఆర్పీసీ-160 కింద పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. మిగతా కేసుల్లోని నిందితుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? అని నిలదీశారు. ఘటనలపై దర్యాప్తునకు పూర్తిగా స్థానిక అధికారులతోనే సిట్ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వారిని కొనసాగించే ప్రశ్నే లేదన్నారు. ఈ కేసులోని వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనుకోవడం లేదని, అన్నిటికీ సీబీఐ ఒక్కటే పరిష్కారం కాదని, మరే ఏజెన్సీతో విచారణ జరిపిస్తే బాగుంటుందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీశ్సాల్వేకి సూచించారు. లఖింపుర్ ఖేరి ఉదంతంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థిస్తూ ఇద్దరు న్యాయవాదులు లేఖ రాయడంతో- ఈ అంశంపై జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో శుక్రవారం హరీశ్సాల్వే వాదనలు వినిపించారు. ‘‘నిందితుడిపై (కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్మిశ్ర కుమారుడు ఆశిష్) ఆరోపణలొచ్చాయి. కేసు తీవ్రత దృష్ట్యా ఆయనకు 160 కింద నోటీసులిచ్చి, విచారణకు పిలిచాం. సమయం కోరడంతో శనివారం ఉదయం 11 గంటలకల్లా రమ్మన్నాం’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడ చాలా గంభీరమైన అభియోగాలున్నాయి. ఎఫ్ఐఆర్లో 302, ఇతర సెక్షన్లు నమోదయ్యాయి. ఇలాంటి కేసులన్నింటి విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? మీకు నోటీసులు పంపుతున్నాం, దయచేసి హాజరుకండి అని మిగతా నిందితులనీ ఇలాగే అర్థిస్తారా?’’ అని ప్రశ్నించారు. సాల్వే బదులిస్తూ, ‘‘పోస్ట్మార్టంలో మృతునికి బుల్లెట్ గాయాలు కనిపించలేదు. అందుకే నిందితునికి 160 కింద నోటీసులిచ్చారు. బుల్లెట్ గాయముంటే పరిస్థితులు మరోలా ఉండేవి. కారును నడిపిన విధానంచూస్తే ఆరోపణలు నిజమేనని అనిపిస్తుంది. అందుకే ఇది 302 కేసు కిందికే వస్తుంది’’ అన్నారు. ఇందుకు సీజేఐ మాట్లాడుతూ- ‘‘నిందితుడి ప్రమేయం గురించి ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నారు కదా? మేము బాధ్యతాయుత ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను, వ్యవస్థను ఆశిస్తున్నాం. 302 కింద కేసు నమోదైనప్పుడు, మృతుడి శరీరంపై తుపాకీతో కాల్చిన గాయాలున్నప్పుడు ఈ దేశంలోని మిగతా నిందితులతోనూ ఇలాగే వ్యవహరిస్తారా? నోటీసులిచ్చి దయచేసి రండి అని అడుగుతారా? పోస్ట్మార్టం నివేదికలో బుల్లెట్ గాయాలు లేవని నిందితుడితో ఇలా వ్యవహరించవచ్చా? అత్యంత తీవ్రమైన కేసులో మీరు వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించలేదు’’ అన్నారు.
విచారణను 18వ తేదీకి వాయిదా వేయాలని, ఆలోగా కేసు విషయంలో అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని అత్యున్నతస్థాయి వర్గాలు చెప్పినట్టు సాల్వే కోర్టుకు విన్నవించారు. ఈ వ్యాఖ్యలతో సీజేఐ ఏకీభవించలేదు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం మాటల్లో తప్ప చేతల్లో చర్యలు కనిపించడంలేదు. సాధారణంగా 302 కింద కేసు నమోదుచేశాక పోలీసులు ఏం చేస్తారు? తక్షణం నిందితుడిని అదుపులోకి తీసుకుంటారు. ఇక్కడ మీరు నోటీసులిచ్చి, హాజరుకావాలని అడుగుతున్నారు’’ అని హరీశ్సాల్వేని ఉద్దేశించి సీజేఐ అన్నారు. జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని, ‘‘ఇది 8 మంది దారుణహత్యకు సంబంధించిన కేసు. ఇందులో నిందితులు ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టం తనపని తాను చేసుకుపోయి, నిందితులందరిపై చర్యలు తీసుకొని ఉండాల్సింది’’ అని అన్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.
సిట్లో వారు వద్దే వద్దు..
జస్టిస్ రమణ మాట్లాడుతూ- ‘‘ఘటనపై వేసిన సిట్ జాబితా చూశాం. అందులో డీఐజీ, ఎస్పీలు, సర్కిల్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లను నియమించారు. వీరంతా స్థానికులు కాబట్టే ఇలా జరుగుతోంది. కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందా?’’ అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ అలా కోరలేదని సాల్వే చెప్పారు. కేసు విచారణను దసరా సెలవుల వరకూ వాయిదా వేయాలని, కావాలంటే అప్పుడు సీబీఐకి అప్పగించాలని.. ఆలోగా ప్రస్తుత కార్యాచరణను కొనసాగనివ్వాలని.. లేకుంటే దర్యాప్తు జాప్యమవుతుందని కోర్టుకు విన్నవించారు. ఇందుకు సీజేఐ స్పందిస్తూ- ‘‘కేసు గంభీరతను బట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. అన్నింటికీ సీబీఐ విచారణే పరిష్కారం కాదు. అందుకు కారణమేంటన్నది మీకే బాగా తెలుసు. కేసుతో సంబంధమున్న వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని, మేం కూడా సీబీఐ విచారణ పట్ల ఆసక్తి చూపడం లేదు. సిట్ అధికారులను కొనసాగించే ప్రశ్నే లేదు. రెండుమూడు రోజుల నుంచి వారి ప్రవర్తన చూస్తున్నాం. దర్యాప్తు సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదు. మరేదైనా ఏజెన్సీ దర్యాప్తు చేపట్టేలోగా... సాక్ష్యాధారాలను పూర్తిగా ధ్వంసంచేసే పరిస్థితి రాకూడదు. అన్ని సాక్ష్యాధారాలను కచ్చితంగా సంరక్షించాలని డీజీపీకి చెప్పండి’’ అని ఆదేశించారు. అందుకు సాల్వే అంగీకరించారు. హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు తానే ఈ విషయం చెప్పి, న్యాయస్థానం ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని కోరతానన్నారు.
వారికి కొంతైనా స్పృహ ఉండాలి
టైమ్స్నౌ ట్వీట్పై సీజేఐ స్పందన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లఖ్నవూ వెళ్లి, లఖింపుర్ ఖేరి బాధిత కుటుంబాలను కలిశారంటూ టౌమ్స్నౌ ఛానల్ ట్విట్టర్లో పేర్కొనడం పట్ల సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రచారం చేసినవారికి కొంతైనా స్పృహ(సెన్స్) ఉండాలన్నారు. తాను కోర్టులో కూర్చొని ఉంటే, లఖ్నవూ వెళ్లి బాధితులను ఎలా కలుస్తానన్నది వారికే తెలియాలన్నారు. విచారణ సందర్భంగా ఆదిత్య అనే యువ న్యాయవాది ఈ ట్వీట్ విషయమై ప్రస్తావించారు. ఇందుకు సీజేఐ స్పందిస్తూ- ‘‘ఇలాంటి వాటి గురించి నేనేమీ మాట్లాడదలచుకోలేదు. ఇవన్నీ టీవీలు చేసే ప్రచారం. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిస్టర్ ఆదిత్యా! ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం పూలు, రాళ్లు రెండూ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని నవ్వుతూ అన్నారు. ప్రైవేటు జీవితాలను కూడా వదిలి పెట్టడంలేదన్న వ్యాఖ్యతో ఆయన ఏకీభవించారు. జస్టిస్ సూర్యకాంత్ మాత్రం ట్వీట్పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. కొందరు భావప్రకటన స్వేచ్ఛ హద్దులను దాటడం బాధాకరం. ట్వీట్లోని అంశాలు పూర్తిగా అవాస్తవం. ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి గౌరవప్రదంగా వ్యవహరించారు. కానీ, ఇది పూర్తిగా కోర్టు ధిక్కారం కిందికే వస్తుంది. ట్వీట్కు బాధ్యులైనవారు తప్పు ఎందుకు జరిగిందో చెబుతూ దాన్ని సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాం. లేకుంటే ఏంచేయాలన్నది తగిన సమయంలో నిర్ణయిస్తాం’’ అని పేర్కొన్నారు. మీడియా స్వతంత్రతను తాము గౌరవిస్తామని, అలాగని హద్దులు మీరడం న్యాయం కాదని జస్టిస్ హిమా కోహ్లీ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. -
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం