Presidential Rule: రాష్ట్రపతి పాలన పెట్టండి
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే ఉగ్రవాద తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పరిస్థితులను చక్కదిద్దడానికి ఆర్టికల్ 356ని ప్రయోగించి, రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తెదేపా వినతి
రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతున్నాయి
ప్రభుత్వమే ఉగ్రవాద తరహా కార్యకలాపాలకు పాల్పడుతోందని ఫిర్యాదు
అంశాలన్నీ తీవ్రమైనవేనని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు
అమరావతిపైనా ఆరా తీశారు
మీడియాకు వెల్లడించిన తెదేపా బృందం
ఈనాడు - దిల్లీ
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే ఉగ్రవాద తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పరిస్థితులను చక్కదిద్దడానికి ఆర్టికల్ 356ని ప్రయోగించి, రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19న రాష్ట్రంలోని తెదేపా ప్రధాన కార్యాలయంపై అల్లరిమూకలు దాడి చేయడం, పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి హింసించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన రాష్ట్రపతిని సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కాలవ శ్రీనివాసులు చంద్రబాబు వెంట ఉన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ ‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్ ఇన్ ఏపీ జూన్ 2019 టు అక్టోబరు 2021’’ పేరుతో ముద్రించిన 323 పేజీల పుస్తకంతోపాటు, తాజా పరిణామాలను వివరిస్తూ రూపొందించిన 8 పేజీల వినతిపత్రాన్ని ప్రతినిధి బృందం రాష్ట్రపతికి అందజేసింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సుమారు అరగంటసేపు చంద్రబాబు ఆయనకు వివరించారు. అవన్నీ సావధానంగా విన్న రాష్ట్రపతి మీరు చెప్పిన అంశాలన్నీ తీవ్రమైనవేనని (సీరియస్), పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని ప్రతినిధి బృందం వెల్లడించింది. రాజధాని అమరావతి ఏమైంది, ఎంతవరకు వచ్చిందని రాష్ట్రపతి ఆరా తీశారు. మంచి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసిందని, అధికారంలోకి వచ్చాక ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదని చంద్రబాబు ఆవేదనతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల ప్రాణాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు, అంతర్గత భద్రతకు ముప్పు ఏర్పడిందని.. మద్యం, డ్రగ్స్, ఇసుక, భూములు, గనులను దోచుకుంటూ నేరసామ్రాజ్యం విస్తరిస్తోందని వివరించారు. రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, 2019 నుంచి వ్యవస్థలన్నింటిపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ తప్పులను వేలెత్తిచూపే ప్రతిపక్షాలు, ప్రజలపై ప్రభుత్వం కక్ష కడుతోందన్నారు. ప్రార్థనా స్థలాల విధ్వంసం, ప్రత్యర్థి పార్టీలు, ప్రజాస్వామ్యవాదులపై దాడులు తీవ్రమైనట్లు తెలిపారు. డీజీపీతోపాటు పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీతో కుమ్మక్కై పోలీసింగ్ను నవ్వులపాలు చేస్తున్నారన్నారు. భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలు కూడా జరుగుతున్నట్లు చెప్పారు. అందువల్ల అత్యవసరంగా ఆర్టికల్ 356ని ప్రయోగించి పరిస్థితులను చక్కదిద్దాలని కోరారు.
గంజాయి సాగు వెనుక వైకాపా హస్తం
వైకాపా నేతలతో కూడిన మాఫియా సుమారు 25 వేల ఎకరాల్లో రూ.8వేల కోట్ల విలువైన గంజాయిని పండిస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి దేశం మొత్తానికి డ్రగ్స్ సరఫరా చేస్తోందని చంద్రబాబు వివరించారు. ‘సెప్టెంబర్ 15న గుజరాత్లోని ముంద్రా పోర్టుకు విజయవాడ చిరునామాతో ఉన్న ట్రేడింగ్ కంపెనీ పేరుతో 3వేల కిలోల హెరాయిన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మాదకద్రవ్యాల అడ్డాగా మారిపోయి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుతోందనడానికి ఇదే ప్రబల ఉదాహరణ. అడ్డదారుల్లో విచ్చలవిడిగా డబ్బు సంపాదిస్తున్న అధికార పార్టీ నేతలు ఆ మాఫియా నెట్వర్క్ను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న డ్రగ్స్ నెట్వర్క్ గురించి తెదేపా నేతలు ప్రశ్నించినందుకు ఈ నెల 19న డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెదేపా కేంద్ర కార్యాలయంపైనా, రాష్ట్రవ్యాప్తంగా పలువురు తెదేపా నేతల ఇళ్లపైనా దాడులు చేశారు. విషయాన్ని పసిగట్టి ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. డీజీపీ, అధికార పార్టీ నేతలు కుమ్మక్కయ్యారనడానికి ఇదే నిదర్శనం.
* ఈ ప్రభుత్వం పోలీసులతో కుమ్మక్కై అరాచకాన్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ప్రశ్నించినందుకు ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రజలు, నేతలను తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా హింసిస్తున్నారు.
* ఆర్టికల్ 21 కింద రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజూ ముప్పు తలెత్తుతోంది. ఆర్టికల్ 19 ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను పోలీసుల ద్వారా అణచివేస్తున్నారు. ప్రార్థనా స్థలాలపై నిరంతరం దాడులు చేస్తూ ఆర్టికల్ 25 ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కును ధ్వంసం చేస్తున్నారు.
మీ ఆదేశాలనూ పట్టించుకోలేదు
రాష్ట్రంలో చట్టాల అమలు తీరుపై సుప్రీంకోర్టు, హైకోర్టులు పలుమార్లు ఆక్షేపించాయి. 2020 జులై 21న తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా నేతల చేతుల్లో శిరోముండనానికి గురైన దళిత యువకుడు ఇండుగుమల్లి వరప్రసాద్ మీకు (రాష్ట్రపతికి) మొరపెట్టుకున్నారు. దానిపై తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించి ఏడాదైనా అతీగతీ లేదు.
* రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో నడుస్తున్న మాఫియాకు మద్యం వ్యాపారమే ఉదాహరణ. గుర్తింపు పొందిన మద్యం బ్రాండ్లను ఆపేసి తమకు నచ్చిన మద్యం తీసుకొచ్చి ప్రతి సీసాపై జే-ట్యాక్స్ వసూలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న క్రైమ్ సిండికేట్ మద్యం వ్యాపారంలో అడుగుపెట్టి నాసిరకమైన సొంత బ్రాండ్లను అత్యధిక ధరకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
* 2019-20, 2020-21 బడ్జెట్లో రూ.41,043 కోట్ల ప్రజాధనానికి లెక్కలు చూపలేని స్థితికి రాష్ట్రంలో మాఫియా చేరింది. ఈ భారీ ఆర్థిక అక్రమాన్ని ప్రజాపద్దుల సంఘం వెలికితీసింది. దీనిపై ఇప్పటికే గవర్నర్కు ఫిర్యాదు చేశాం. దీనిపై దర్యాప్తు జరపకపోతే మున్ముందు భారీ ఎత్తున ప్రజాధనం దోపిడీ జరిగే ప్రమాదం ఉంది’ అని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
తెదేపా ప్రధాన డిమాండ్లు ఇవీ..
* రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్ మాఫియా రాజ్యమేలడంతో పాటు ప్రభుత్వమే పోలీసులను వాడుకొని హింసాత్మక చర్యలు, దాడులకు పాల్పడుతున్నందున ఆర్టికల్ 356 ప్రయోగించాలి.
* ఆంధ్రప్రదేశ్ మాదకద్రవ్యాలకు అడ్డాగా మారడంలో ప్రమేయమున్న వ్యక్తులను కనిపెట్టి శిక్షించేందుకు లోతైన దర్యాప్తు జరిపించాలి.
* తెదేపా ప్రధాన కార్యాలయం, రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నాయకుల ఇళ్లపై చేసిన దాడులపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలి.
* అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న డీజీపీని రీకాల్ చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు