వచ్చేస్తోంది.. మెటావర్స్ ప్రపంచం
మనిషి పనిని సులభతరం చేసేది సాంకేతికత. కొత్త ఆవిష్కరణలతో మానవుడు ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతలను రూపొందిస్తూనే ఉన్నాడు. అంతర్జాలం, స్మార్ట్ఫోన్, కంప్యూటర్ వంటి సాధనాలు..విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి. ఇప్పుడు వీటికి మించిన సాంకేతికత రానుంది. అదే ‘మెటావర్స్’.
ఇక అంతా వర్చువల్గానే..
రేసులో దిగ్గజ సంస్థలు
మనిషి పనిని సులభతరం చేసేది సాంకేతికత. కొత్త ఆవిష్కరణలతో మానవుడు ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతలను రూపొందిస్తూనే ఉన్నాడు. అంతర్జాలం, స్మార్ట్ఫోన్, కంప్యూటర్ వంటి సాధనాలు..విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి. ఇప్పుడు వీటికి మించిన సాంకేతికత రానుంది. అదే ‘మెటావర్స్’. ఇంటర్నెట్ తర్వాత దీన్ని అతి పెద్ద మార్పుగా పేర్కొంటున్నారు. మనుషులను పూర్తిగా వర్చువల్ ప్రపంచంలో ఓలలాడించే ఈ సాంకేతికత.. ఆన్లైన్ అనుభూతిని సమూలంగా మార్చేస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఫేస్బుక్ సహా ప్రముఖ సంస్థలు.. ఈ సరికొత్త టెక్నాలజీపై దృష్టిపెట్టాయి.
రంగంలో జుకర్బర్గ్..!
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్.. మెటావర్స్ సాంకేతికతపై దృష్టి పెట్టారు. ఫేస్బుక్ను ఓ సామాజిక మాధ్యమ సంస్థగా కంటే.. భవిష్యత్తులో మెటావర్స్ కంపెనీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇప్పటికే వేలాది మందిని ఈ పని కోసం నియమించుకున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి విభాగాలనూ మెటావర్స్ పరిధిలోకి తీసుకురానున్నారు. దీనిపై ఫేస్బుక్ వార్షిక వర్చువల్ రియాలిటీ కాన్ఫరెన్స్లో జుకర్బర్గ్ ప్రకటన చేయనున్నారని ‘ది వర్జ్’ అనే పత్రిక వెల్లడించింది. ఫేస్బుక్ తాజా నివేదికలోనూ మెటావర్స్ గురించి వివరించింది. దీంతో టెక్ నిపుణుల దృష్టి దీనిపై పడింది. ఇదే అంతర్జాల భవిష్యత్ కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఈ పరిజ్ఞానం ఏమిటంటే..?
అంతర్జాలం రాకతో పనులన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. మెటావర్స్ వీటిని తలదన్నే సాంకేతికత. భౌతిక ప్రపంచంలోని మనుషులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లనుంది. ఆడుకోవడం, మాట్లాడుకోవడం, పని చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ వర్చువల్గా రియల్టైమ్లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటూనే ప్రపంచంలో ఏ మూలన ఉన్న వ్యక్తినైనా కలవొచ్చు. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. నచ్చిన ప్రాంతాన్ని సందర్శించవచ్చు. వీడియో కాల్స్లో సహోద్యోగులను చూడటానికి బదులుగా.. వర్చువల్ వాతావరణంలో వారితో కలిసి పనిచేసుకోవచ్చు. హెడ్సెట్లు, అగ్మెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు, స్మార్ట్ఫోన్ యాప్లు, ఇతర పరికరాల సాయంతో ఈ మెటావర్స్ను అభివృద్ధి చేయనున్నారు. ‘‘ఇది తర్వాతి తరం కనెక్టివిటీ. ఈ విశ్వంలో ఇక్కడ ప్రతీదీ ఒకే చోట లభిస్తుంది. భౌతిక జీవితాన్ని గడిపినట్లే.. వర్చువల్గా మీ జీవితాన్ని గడుపుతారు’’ అని అధునాతన సాంకేతికతలపై పనిచేసే విశ్లేషకులు విక్టోరియా పెట్రాక్ వివరించారు. ‘మెటావర్స్’ పదాన్ని మొదటిసారి నీల్ స్టీఫెన్సన్ అనే రచయిత ఉపయోగించారు. 1992లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ‘స్నో క్రాష్’లో దీని గురించి ప్రస్తావించారు.
వీడియో గేమ్స్ కంపెనీలకు వరం
ఫేస్బుక్ కాకుండా.. చాలా సంస్థలు మెటావర్స్పై పనిచేస్తున్నాయి. వీడియో గేమ్స్ కంపెనీలకు ఈ సాంకేతికత ఒక వరం లాంటిదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ గేమ్స్కు విపరీతమైన ఆదరణ ఉంది. ఇక వర్చువల్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. నెట్టింట ప్రత్యక్షంగా ఆడుకోవడమంటే.. గేమర్లకు సరికొత్త అనుభూతి అనే చెప్పాలి. ఎపిక్ గేమ్స్ అనే సంస్థ ఈ సాంకేతికతపై వేగంగా పనిచేస్తోంది. దీర్ఘకాలిక లక్ష్యాల్లో భాగంగా మెటావర్స్ను తీర్చిదిద్దేందుకు పెట్టుబడిదారుల నుంచి రూ.ఏడున్నర వేల కోట్లను సమీకరించింది. రోబ్లాక్స్ అనే మరో దిగ్గజ సంస్థ ఈ దిశగా అడుగులు వేస్తోంది. 3డీ ప్రపంచంలో నేర్చుకోవడం, ఆడుకోవడం, పని చేసుకోవడం, సామాజికంగా అనుసంధానమవ్వడం వంటి అంశాలపై దృష్టిసారిస్తోంది. ఇటాలియన్ ఫ్యాషన్ సంస్థ గూచీ.. జూన్లో రోబ్లాక్స్తో జట్టుకట్టింది. ‘డిజిటల్ ఓన్లీ’ పరికరాలను విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కోకాకోలా, క్లినిక్ సంస్థలు డిజిటల్ టోకెన్లను విక్రయిస్తున్నాయి. మెటావర్స్కు ఇది తొలి అడుగు అని భావిస్తున్నారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరుగుతుందన్న చర్చలూ సాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు