Chandrababu: క్లెమోర్మైన్స్ పేలుళ్లకూ చలించని నేత
మావోయిస్టులు క్లెమోర్ మైన్స్తో దాడిచేసినా మనిషి చలించలేదు. ధైర్యం చేజారనివ్వలేదు...! మనసులో ఎన్ని బడబాగ్నులు రగులుతున్నా గంభీరంగా ఉండటమే ఆయనకు తెలుసు.
అవమానభారంతో కన్నీరు మున్నీరైన వేళ
ఈనాడు, అమరావతి: మావోయిస్టులు క్లెమోర్ మైన్స్తో దాడిచేసినా మనిషి చలించలేదు. ధైర్యం చేజారనివ్వలేదు...! మనసులో ఎన్ని బడబాగ్నులు రగులుతున్నా గంభీరంగా ఉండటమే ఆయనకు తెలుసు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ఆయన కన్నీరు పెట్టడం సహచరులెవరూ చూడలేదు. శుక్రవారం శాసనసభలో జరిగిన అవమానంతో చలించిపోయి తెదేపా అధినేత చంద్రబాబు రోదించారు. శాసనసభ ఆయనకు కొత్తకాదు. సభలో ఆవేశకావేశాలు, రాజకీయ విమర్శలు, ఉద్విగ్న, ఉద్రిక్త పరిస్థితులూ కొత్తకాదు. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి, నేదురుమల్లి జనార్దన్రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి ఎందరో నాయకులతో ఢీ అంటే ఢీ అన్నారు. దీటుగా నిలబడ్డారు. కానీ నిండుసభలో... వైకాపా ఎమ్మెల్యేలు తన భార్యపై వ్యక్తిత్వ హననానికి పాల్పడం, ఆమెను కించపరిచేలా అత్యంత అవమానకరంగా, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. తీవ్రంగా కుంగిపోయారు.
కట్టలు తెగిన ఆవేదన
అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలపై సభలో వాగ్వాదం జరిగాక స్పీకర్ సభను వాయిదా వేయడంతో చంద్రబాబు తన ఛాంబర్లోకి వచ్చి కూర్చున్నారు. ఆప్పటికే ఆయన ముఖం అవమానభారంతో ఎరుపెక్కింది. అప్పటికీ ఉబికివస్తున్న దుఃఖాన్ని నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నించారు. కాసేపు యాంటీరూమ్లోకి వెళ్లి వచ్చారు. చంద్రబాబును చూస్తూనే శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు... ఆయన కాళ్లకు నమస్కరించి, కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ సహచరుల్ని చూశాక చంద్రబాబు అంతరంగంలో సుడులు తిరుగుతున్న బాధ ఆగలేదు. వారి ముందే భోరున విలపించారు. అంత అవమానం జరిగాక... ఇక సభలోకి అడుగు పెట్టకూడదన్న నిర్ణయం తీసుకున్నారు. సభలోనే తన ఆవేదన వెల్లడించి... బయటకు వచ్చేయాలన్న ఉద్దేశంతో మళ్లీ సభలోకి వెళ్లారు. స్పీకర్ మైక్ ఇచ్చారు. చంద్రబాబు తన ఆవేదన తెలియజేస్తున్నా... అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు పూర్తిగా మాట్లాడక ముందే... స్పీకర్ మైక్ కట్ చేయడంతో, ఆయన తీవ్ర ఆవేదనతో సభ నుంచి బయటకు వచ్చేశారు. అక్కడి నుంచి అవమానభారంతో నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక పదేపదే భోరున విలపించారు.
చెక్కుచెదరని ధైర్యం చలించిన వేళ..
దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి... పిన్న వయసులోనే మంత్రిగా, నాలుగు పదుల వయసులోనే ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్ర రాజకీయాల్లోనూ క్రియాశీలంగా వ్యవహరించిన నేపథ్యం చంద్రబాబుది. ఆ ప్రస్థానంలో ఆయన అనేక ఎదురుదెబ్బలూ తిన్నారు. అయినా ఎప్పుడూ చలించలేదు. 1983లో చంద్రగిరిలో ఓడిపోవడం ఆయనకు రాజకీయంగా తగిలిన మొదటి ఎదురుదెబ్బ. తర్వాత అనేక ఆటుపోట్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. 1989లో పార్టీ ఓడిపోయినా... డీలా పడకుండా, మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చేవరకూ అవిశ్రాంత పోరాటం చేశారు. 2004, 2009 ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురైనప్పుడూ పోరాటం ఆపలేదు. ఆరు పదుల వయసులోనూ సుదీర్ఘ పాదయాత్ర చేసి... పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2003లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... తిరుపతిలో అలిపిరి వద్ద మావోయిస్టులు క్లెమోర్మైన్స్ పేల్చినప్పుడు తీవ్రంగా గాయపడ్డా ఆయన భయపడలేదు. కంటి నుంచి చుక్క నీరు రాలేదు. 2019 ఎన్నికల్లో పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైనప్పుడూ ఆయన కుంగిపోలేదు. వెంటనే తేరుకుని మళ్లీ పోరాటం ప్రారంభించారు. ప్రభుత్వ నిర్బంధాల్ని, ఆంక్షల్ని, పార్టీ నాయకులపై పెడుతున్న కేసుల్ని, కార్యకర్తలపై వేధింపుల్ని తట్టుకుని నిలబడ్డారు. చివరకు పార్టీ కేంద్ర కార్యాలయంపై ప్రత్యర్థులు దాడికి పాల్పడినా చలించలేదు. అలాంటి నాయకుడు... శాసనసభలో జరిగిన అవమానంతో పొగిలి పొగిలి ఏడవడంతో ఆయన సహచరులు, పార్టీ నాయకులు చలించిపోయారు.
పార్టీ కార్యాలయంలో ఉద్విగ్న వాతావరణం
విలేకరుల సమావేశంలో చంద్రబాబు విలపించడాన్ని టీవీల్లో చూసి తీవ్ర ఆవేదనతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హుటాహుటిన తెదేపా కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పార్టీ నాయకులు కేశినేని నాని, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, బోడే ప్రసాద్, నక్కా ఆనంద్బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాస్ తదితరులు పార్టీ కార్యాలయానికి చేరుకుని అధినేతతో సమావేశమయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై... కార్యకర్తలు నిరసన తెలియజేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆధ్వర్యంలో... వైకాపా జెండాలు, ఆ పార్టీ నాయకుల చిత్రాలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు