AP 3 Capitals: మూడు రాజధానుల చట్టాల ఉపసంహరణ.. జగన్నాటకం
రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి తప్పించుకునేందుకు, వైకాపాపై ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల చట్టాలను....
వైకాపాపై వ్యతిరేకత నుంచి... ప్రజల దృష్టి మరల్చేందుకే
తెదేపా వ్యూహకమిటీ సమావేశంలో చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి తప్పించుకునేందుకు, వైకాపాపై ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు నాటకమాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప.. ఈ రెండున్నరేళ్లలో ఆ మూడు ప్రాంతాల్లో అభివృద్ధికి పైసా అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ వ్యూహాత్మక కమిటీ సోమవారం సమావేశమైంది. అందులో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు మెజార్టీ స్థానాల్లో వైకాపాను గెలిపించారు. నేడు వరదలతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా.. పక్క రాష్ట్రాల్లో పెళ్లి విందులు, వినోదాలతో కాలక్షేపం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు. ‘మహిళలపై అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలు చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్నారు’ అని చంద్రబాబు విమర్శించారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప.. ఆయన చేసింది ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.
కమిటీ నిర్ణయాలు ఇలా...
రాజధానిపై సీఎం జగన్ వ్యవహార శైలితో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతోందని తెదేపా వ్యూహ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోవడంతోపాటు... రాష్ట్ర ఆదాయానికి పెద్దయెత్తున గండిపడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలు, అవినీతి, వివేకా హత్య వ్యవహారం నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రతిపక్షనేతను లక్ష్యంగా చేసుకొని, వ్యక్తిత్వహననానికి దిగుతున్నారని అభిప్రాయపడింది. జగన్ ఉన్మాద చర్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించింది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంతో సీఎం విఫలమయ్యారని, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏరియల్ రివ్యూ చేసి చేతులు దులిపేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా అప్రమత్తం కాలేదని, ఫలితంగానే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని విమర్శించింది.
ఓటీఎస్కు డబ్బు చెల్లించొద్దు
* వివిధ పథకాల కింద నిర్మించిన గృహాలకు సంబంధించిన రుణాల్ని ఓటీఎస్ కింద పేదలెవరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓటీఎస్ ద్వారా వైకాపా ప్రభుత్వం ఆదాయం పొందాలనుకోవడం దుర్మార్గపు చర్య. ఓటీఎస్ కింద పేద కుటుంబాలపై ఈ భారం పడకుండా అవగాహన కల్పించాలి.
* వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆర్టీజీఎస్ను సరిగా వినియోగించుకోలేదు. తెదేపా బృందాలు బాధితులకు అండగా నిలవాలి.
* స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ.3,594 కోట్ల నిధుల్ని ప్రభుత్వం దారి మళ్లించి దుర్వినియోగం చేయడం చట్ట విరుద్ధం. ఇది అధికార వికేంద్రీకరణకు గండి కొట్టడమే.
* మాజీ మంత్రి వివేకానందరెడ్డిని.. ఆయన అల్లుడే చంపించాడని కట్టుకథలు అల్లిస్తూ దోషులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ దుర్మార్గాన్ని ఎండగట్టాలి.
* కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో వైకాపా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. కోరం(తగిన ఆధిక్యం) ఉన్నా ఎన్నిక నిలిపివేయడం దుర్మార్గం. సమావేశంలో శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాలవ శ్రీనివాసులు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM