AP Legislative Council: మండలి రద్దుపై మడమ తిప్పిన సర్కారు
శాసన మండలి రద్దుకు గతంలో చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. మండలిని రద్దు చేయాలని శాసనసభలో చేసిన తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నందున సభ్యుల్లో నెలకొన్న అనిశ్చితి, సందిగ్ధత తొలగించేందుకే
గతంలో చేసిన రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం
సభ్యుల్లో అనిశ్చితి తొలగించేందుకేనని వెల్లడి
తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మంత్రి బుగ్గన
ఈనాడు - అమరావతి
శాసన మండలి రద్దుకు గతంలో చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. మండలిని రద్దు చేయాలని శాసనసభలో చేసిన తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నందున సభ్యుల్లో నెలకొన్న అనిశ్చితి, సందిగ్ధత తొలగించేందుకే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వివిధ స్థాయుల్లో ప్రయత్నాలు చేసినా, శాసనసభ తీర్మానంపై చర్య తీసుకోవడంలో భారత ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. ఈ మేరకు 2020 జనవరి 27న చేసిన ‘శాసన మండలి రద్దు’ తీర్మానం ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మంగళవారం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ..‘‘2019లో ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు వెంటనే చట్ట రూపంలో అమలు కావాలనే ఉద్దేశం ఉండగా.. వివిధ కారణాలతో ఆలస్యమయ్యాయి. వీటిపై శాసనసభలో చర్చించాం. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన వారే సుప్రీం ప్రజాప్రతినిధులు. శాసన మండలి సలహాలు ఇచ్చేందుకు అదనంగా మాత్రమే ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రయోజనంగా ఉంటుంది. 2020 జనవరి 27న అప్పటి పరిస్థితులను అనుసరించి మండలి రద్దుకు తీర్మానం చేశాం. శాసన సభలో విద్యావంతులు ఉన్నందున మండలి అవసరం లేదని చర్చించిన తర్వాత తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అది అక్కడ పెండింగ్లో ఉంది. ప్రస్తుతం శాసనమండలి కొనసాగుతున్నందున సభ్యుల పదవీకాలం ఎప్పటి వరకు ఉంటుందనే దానిపై అనిశ్చితి ఏర్పడుతోంది. అనిశ్చితిలో జరిగే సమావేశాల్లో సానుకూల నిర్ణయాలు రాకపోవచ్చు. హోం మంత్రిత్వ శాఖ వద్ద మండలి రద్దు తీర్మానం పెండింగ్లో ఉన్నందున పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చేవారు విద్యావంతులు, ప్రజలకు సేవ చేసేవారు వస్తున్నారు. మండలి ఛైర్మన్గా దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు. కొత్త సభ్యులు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రతి ఒక్కటీ రాజకీయం చేయకూడదనే ఆలోచనతో ఉంటారనే ఉద్దేశంతో శాసనమండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని వెల్లడించారు.
14 బిల్లులకు శాసనసభ ఆమోదం
శాసనసభలో మంగళవారం అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్ట సవరణ -2021 బిల్లును ఆమోదించారు. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లు-2021కి కూడా సభ ఆమోదం తెలియజేసింది. వీటితో పాటు మొత్తం 14 బిల్లులను మంగళవారం శాసనసభ ఆమోదించింది. సినిమా నియంత్రణ చట్ట సవరణ, మోటారు వాహనాల పన్నుల చట్ట సవరణ బిల్లులతో పాటు విద్యాసంస్థల్లో టీచర్ల క్యాడర్కు సంబంధించిన రిజర్వేషన్ల బిల్లును, వ్యవసాయ, వ్యవసాయేతర జోన్ల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)