Automation: ఆటోమేషన్తో వరద అంచనా
భారీవర్షాలు, వరదల సమయంలో చిన్న, పెద్ద జలాశయాల పరిధిలో వర్షపాతం, వరద ప్రవాహాల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి పర్యవేక్షించేందుకు రియల్టైమ్ ఆటోమేషన్ విధానాన్ని
జలాశయాలపై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ
శాసనసభలో సీఎం జగన్ ప్రకటన
ఈనాడు, అమరావతి: భారీవర్షాలు, వరదల సమయంలో చిన్న, పెద్ద జలాశయాల పరిధిలో వర్షపాతం, వరద ప్రవాహాల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి పర్యవేక్షించేందుకు రియల్టైమ్ ఆటోమేషన్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. దీనికి జలవనరులశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ ఛీఫ్) కార్యాలయంలో కంట్రోల్రూం ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలిచ్చామన్నారు. భారీ వరదల నేపథ్యంలో గేట్లు ఉన్న చిన్న, పెద్ద జలాశయాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వరద నష్టం, సహాయ చర్యలపై శాసనసభలో శుక్రవారం సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటన చేశారు. ‘నాలుగు జిల్లాల్లో 1,990 గ్రామాలపై వరద ప్రభావం ఉంటే, అందులో 211 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. 44 మంది మరణించగా 16 మంది గల్లంతయ్యారు. వీరికి రూ.5లక్షల చొప్పున పరిహారం ఇచ్చాం. 1,169 ఇళ్లు పూర్తిగా, 5,434 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 319 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటుచేసి 79,590 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. కలెక్టర్లకు నిధులిచ్చాం. 95,949 కుటుంబాలకు నిత్యావసరాలతో పాటు కుటుంబానికి రూ.2వేలు అందించాం. చనిపోయిన 5,296 పశువులకు నష్టపరిహారం అందించాం. పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించాం’ అని చెప్పారు. ‘వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి డ్రామాలు చేయడం కాదు, పనులు సరిగా చేస్తున్నారా? ప్రజలకు మంచి జరుగుతోందా? అనేది చూస్తూ.. వాటిని సక్రమంగా చేయించడమే నాయకుడి పని’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘అక్కడికి వెళ్లి చంద్రబాబు రాజకీయాలు మాట్లాడారు. ఆయన వరద ప్రాంతాలకు పోయింది ఎందుకు, మాట్లాడే మాటలేంటి? ఆయన సంస్కారానికి నా నమస్కారాలు’ అని విమర్శించారు.
నవీన్పట్నాయక్ ఎప్పుడైనా వరద ప్రాంతాల్లో కనిపించారా?
‘ఒడిశాలో ఏటా వరదలు వస్తాయి. ఏ రోజైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్పట్నాయక్ వరద ప్రాంతాల్లో కనిపించారా? సీఎం అక్కడకు వస్తున్నారంటే ఆయన చుట్టూనే అధికారులు, మీడియా తిరగడంతో సహాయ చర్యలపై పర్యవేక్షణ ఉండదు’ అని ముఖ్యమంత్రి వివరించారు. ‘వరద ప్రాంతాల్లో ఏం చేయాలో.. అవన్నీ చేస్తూ, రోజూ సమీక్షించాం. సీనియర్ అధికారుల్ని జిల్లాలకు పంపించాం. మంత్రులు, ఎమ్మెల్యేలను శాసనసభకు రావద్దని, అక్కడే ఉండి పర్యవేక్షించాలని ఆదేశించాం’ అని చెప్పారు.
‘ఈనాడు’ వార్తలోనే స్పష్టంగా ఉంది
అధికారులు అర్ధరాత్రి వెళ్లి వరదపై ప్రజల్ని ఎలా అప్రమత్తం చేశారో.. ‘ఈనాడు’ రాసినదాంట్లో స్పష్టంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఆ క్లిప్పింగ్ను శాసనసభలో ప్రదర్శించారు. పింఛ ప్రాజెక్టులో మూడు స్పిల్వే గేట్లు, రెండు అత్యవసర పూడిక గేట్లు ఎత్తినా.. వరద ప్రవాహం సామర్థ్యానికి మూడు రెట్లు ఎక్కువగా వచ్చిందని ‘ఈనాడు’లో రాశారన్నారు. ప్రధాన పత్రిక తొలి పేజీలో వచ్చిన ‘చంద్రబాబుకు తన ఇంట్లో పరిస్థితి వివరిస్తున్న నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామ మహిళ’ చిత్రంపై జగన్ విమర్శలు చేశారు. ‘వాస్తవానికి వాళ్లది పక్కా ఇల్లు.. ఆ ఇంటి అదనపు భాగంలో నిల్చుని పాక అని చెబుతున్నారు. చిత్రంలోని మన్నెమ్మకు నిత్యావసరాలు, రూ.2వేలతో పాటు దెబ్బతిన్న ఇంటికి రూ.4,200 ఇచ్చాం. వాలంటీర్ల ద్వారా అందరికీ ఎలా సహాయం అందిస్తున్నామనేందుకు ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.
ఎయిడెడ్ విషయంలో గోబెల్స్ ప్రచారం
ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు, వాటి యాజమాన్యాలు, అందులోని ఉపాధ్యాయులు, పిల్లలకు మంచి జరగాలనే దృక్పథంతోనే కొత్త విధానం తెచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ విషయంలో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విద్యారంగంపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘సేవా భావంతో నిర్మించిన భవనాలు కాలక్రమంలో దెబ్బతిన్నాయి. 25 ఏళ్లుగా ఎయిడెడ్ ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయట్లేదు. తమను విలీనం చేసుకోవాలని ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకే యాజమాన్యాలకు ప్రభుత్వం అవకాశాలు ఇచ్చింది. ఆప్షన్ ఇచ్చాక కూడా వెనక్కి తీసుకోవచ్చని చెప్పాం’ అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం