AP High Court: అమరావతి అభివృద్ధికి అడ్డంకి కాదు
రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి గతంలో తామిచ్చిన యథాతథ స్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు అడ్డంకి కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
సీఆర్డీఏలో యథాతథ స్థితి ఉత్తర్వులపై హైకోర్టు
కార్యాలయాల తరలింపు నిలిపివేత ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయి
రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టీకరణ
యథాతథ స్థితి ఉత్తర్వులపై హైకోర్టు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి గతంలో తామిచ్చిన యథాతథ స్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు అడ్డంకి కాదని హైకోర్టు స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్ట నిబంధనల మేరకు అభివృద్ధి కొనసాగించవచ్చని పేర్కొంది. స్టేటస్కో కారణంగా అమరావతిలో అభివృద్ధి నిలిచిపోవడాన్ని తాము కోరుకోవడం లేదని తెలిపింది. న్యాయస్థానం జోక్యంతో అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయనే భావన కలగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాలనను తాము చేయాలనుకోవడం లేదని, వారి ప్రతి నిర్ణయాన్ని అనుమానించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపు, ఇళ్ల స్థలాల కేటాయింపును నిలువరిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని తేల్చిచెప్పింది. సీఆర్డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను ‘రద్దు’ చేస్తూ శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లుకు గవర్నర్ సమ్మతి తెలపాల్సి ఉందని, ఆయన అనారోగ్యంతో ఉన్నారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఆమోదం కోసం ఈ నెల 25న బిల్లును గవర్నర్కు పంపించామన్నారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతోంది, హైకోర్టు వ్యవహారంలో చోటుచేసుకున్న పరిణామాలు తదితర వివరాలతో కోర్టు ముందు మెమో దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం కావాలన్నారు. దీంతో విచారణను డిసెంబర్ 27కు వాయిదా వేస్తూ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది.
రాజధాని వ్యాజ్యాలపై ఈ నెల 22న విచారణ సందర్భంగా ఏజీ జోక్యం చేసుకుంటూ సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటన చేయబోతున్నారని తెలిపారు. బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నారన్నారు. దీంతో ధర్మాసనం.. బిల్లుతో పాటు, దాన్ని తీసుకురావడానికి కారణాలతో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అఫిడవిట్ దాఖలు చేశారు. బిల్లులను ఈ నెల 22న శాసనసభ, 23న శాసనమండలి ఆమోదించాయని పేర్కొన్నారు. సోమవారం ఈ వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి.
విచారణ కొనసాగించాలన్న పిటిషనర్లు
రాజధాని రైతు పరిరక్షణ సమితి, తదితరుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్, పీబీ సురేశ్ వాదనలు వినిపిస్తూ.. బిల్లు ఇంకా చట్టం కాలేదన్నారు. గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. ప్రభుత్వం సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేస్తూ బిల్లు పెడుతున్నాం అంటూనే.. మరోవైపు మూడు రాజధానుల కోసం బిల్లు తెస్తామని చెబుతోందన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనేది తమ వాదన అన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వ్యాజ్యాల్లో అభ్యర్థించామన్నారు. వాటిపై విచారణను కొనసాగించాలని కోరారు. సీజే స్పందిస్తూ.. సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ ఇటీవల వాదనలు వినిపిస్తూ రాజధాని అమరావతిని ప్రభుత్వం ఘోస్ట్ సిటీగా మార్చిందన్నారని గుర్తుచేశారు. ఈ వ్యాజ్యాలను అపరిష్కృతంగా ఉంచితే అవి కూడా ‘ఘోస్ట్ పిటిషన్లు’గా మారతాయని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ చర్యలు విచారణలో జోక్యం చేసుకోవడమే
రాజధాని రైతులు మరికొందరి తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కోరిన అభ్యర్థనలు ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. వాటిపై విచారణ కొనసాగించాలన్నారు. ‘ఈ వ్యాజ్యాలను తేల్చకుండా ప్రభుత్వం మూడుసార్లు ప్రయత్నం చేసింది. ఈ తరహా చర్యలు కోర్టు విచారణ ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతికి భూములిచ్చిన సుమారు 200 మంది రైతులు కన్నుమూశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది. అందుకు బాధ్యులెవరు? అమరావతి మాస్టర్ ప్లాన్ను సవరించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. వివిధ శాఖల కార్యాలయాలు, ఉద్యోగులను తరలించేందుకు గతంలో ప్రయత్నం చేయగా.. హైకోర్టు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది’ అన్నారు. ఆ ఉత్తర్వులు అమలులో ఉండేలా చూడాలని కోరారు.
చట్టాలు చేయకుండా నిషేధించలేం: ధర్మాసనం
న్యాయవాది పీబీ సురేశ్ స్పందిస్తూ.. బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపుతారా? పునఃపరిశీలన చేయమని కోరతారా? రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారా అని పలు సందేహాలున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొస్తామని చెబుతోందన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వం చట్టాలు చేయకుండా నిషేధ ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని విచారిస్తామని స్పష్టం చేసింది.
* పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ స్పందిస్తూ.. మూడు రాజధానుల చట్టాన్ని (పాలన వికేంద్రీకరణ) చేసే శాసనాధికారం గానీ, దాన్ని రద్దు చేసే అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. తాజా బిల్లును సవాలు చేస్తూ వ్యాజ్యం వేస్తానన్నారు.
* శాసనసభ కార్యదర్శి తరఫున న్యాయవాది మెట్టా చంద్రశేఖర్ వాదనలు వినిపిస్తూ.. సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టసభల్లో పెట్టిన బిల్లు ఆమోదం పొందాక.. ఆ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు వ్యర్థమవుతాయన్నారు. కొత్త చట్టం తెచ్చినప్పుడు దానిపై అభ్యంతరాలుంటే సవాలు చేసుకోవచ్చన్నారు.
* తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ స్పందిస్తూ.. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వ్యాజ్యంలో కోరామన్నారు. రాజధానుల విషయంలో శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. తమ వ్యాజ్యంపై విచారణ కొనసాగించేందుకు అనుమతివ్వాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
హామీలకు శిలువ!
గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్. దాన్ని బైబిల్తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్ వంచించారు. -
అక్రమాల కిరణం!
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.