Farm Laws: చట్టాలకు చెల్లు
వివాదం రేకెత్తించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. సోమవారం శీతాకాల సమావేశాలు మొదలైన వెంటనే తొలుత లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభ ఎలాంటి చర్చ లేకుండానే దీనికి మూజువాణి ఓటుతో సమ్మతి తెలిపాయి. మొత్తం ప్రక్రియ రెండు గంటల్లో ముగిసిపోయింది. బిల్లును శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఉభయ సభల్లోనూ బిల్లు ప్రవేశపెట్టారు. చట్టాల రద్దు నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించినా, దానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించాలని పట్టుపట్టాయి.
సాగు చట్టాల రద్దు బిల్లుకు తొలిరోజే పార్లమెంటు ఆమోదం
ప్రధాని మాట నిలబెట్టుకున్నారు
కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్
ఇతర రైతు సమస్యలపై ఉభయ సభల్లో విపక్షాల నిరసన
దిల్లీ
వివాదం రేకెత్తించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. సోమవారం శీతాకాల సమావేశాలు మొదలైన వెంటనే తొలుత లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభ ఎలాంటి చర్చ లేకుండానే దీనికి మూజువాణి ఓటుతో సమ్మతి తెలిపాయి. మొత్తం ప్రక్రియ రెండు గంటల్లో ముగిసిపోయింది. బిల్లును శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఉభయ సభల్లోనూ బిల్లు ప్రవేశపెట్టారు. చట్టాల రద్దు నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించినా, దానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించాలని పట్టుపట్టాయి. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఉభయ సభల్లో సభ్యులు నిరసనలు తెలిపారు. పలుమార్లు సభా కార్యకలాపాలకు అంతరాయం వాటిల్లింది. మునుపటి వర్షాకాల సమావేశాల్లో అనుచిత ప్రవర్తనకు గానూ రాజ్యసభలో 12 మంది విపక్ష సభ్యుల్ని ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
మద్దతు ధరకు చట్టబద్ధత ఎప్పుడు?
వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తారంటూ విపక్షాలు లోక్సభలో ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారంపైనా స్పష్టమైన హామీ కావాలని పట్టుపట్టాయి. సభాపతి స్థానం వద్దకు వెళ్లి నినాదాలు చేశాయి. చర్చకు ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానిస్తే.. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మంత్రి తోమర్ విమర్శించారు. మూడు చట్టాల రద్దుకు ఉభయపక్షాలూ సమ్మతించినప్పుడు చర్చ అవసరం లేదన్నారు. వివిధ డిమాండ్లను విపక్షాలు లేవనెత్తి, సభలో ఇతర కార్యకలాపాలను అడ్డుకున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ల నిరసనల నడుమ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాల నోటీసులను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. కొందరు సభ్యులు సభను ఆటంకపరిచే కృత నిశ్చయంతో వచ్చినట్లున్నారని వ్యాఖ్యానించారు.
నిబంధనలను గాలికి వదిలేశారు: కాంగ్రెస్
అన్నదాతల పేరుతో పార్లమెంటులో సోమవారం సూర్యోదయమైందని రాహుల్గాంధీ పేర్కొన్నారు. చర్చ జరిగితే తప్పులు బయటపడిపోతాయని ప్రభుత్వం భయపడిందని విలేకరుల సమావేశంలో ఆయన ఎద్దేవా చేశారు. చర్చను అనుమతించకపోతే పార్లమెంటును మూసివేయడం మేలని అభిప్రాయపడ్డారు. బిల్లును ఆమోదించే విషయంలో పార్లమెంటరీ నిబంధనల్ని గాలికి వదిలేశారనీ, చర్చకు ఏమాత్రం ఆస్కారం కల్పించలేదని లోక్సభలో కాంగ్రెస్పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి విమర్శించారు. బిల్లుకు విపక్షాలే మద్దతు ఇస్తున్నప్పుడు చర్చను ఎందుకు అనుమతించలేదని పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఆయన ప్రశ్నించారు. చర్చ జరిగితే ఈ బిల్లుల వెనుక కుట్ర బయటపడేదని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. బిల్లుల్ని ప్రవేశపెట్టినప్పుడు, చట్టాల్ని రద్దు చేస్తున్నప్పుడు ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించిందని రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.
గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన
పార్లమెంట్ సమావేశాల ఆరంభానికి ముందు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశమయ్యారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వరకు ఎంపీలు ప్రదర్శన నిర్వహించారు. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని నినాదాలిచ్చారు. పార్లమెంటు ఆవరణలో విపక్ష నేతలు సమావేశమై, వ్యూహాన్ని చర్చించారు. తృణమూల్ కాంగ్రెస్, ఆప్ నేతలు దీనికి హాజరు కాలేదు.
ఆనాటి ప్రవర్తనకు 12 మంది సభ్యులపై చర్య
ఈ ఏడాది ఆగస్టు 11 నాటి సమావేశంలో రాజ్యసభలో రభస సృష్టించినందుకు సెక్షన్-256 కింద 12 మంది సభ్యుల్ని ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్ ప్రకటించారు. ఈ మేరకు తీర్మానాన్ని సభలో ఆమోదించారు. సస్పెండైన వారిలో ఛాయావర్మ (కాంగ్రెస్), ప్రియాంక చతుర్వేది (శివసేన), డోలాసేన్ (తృణమూల్), ఎలమారం కరీం (సీపీఎం), బినయ్ విశ్వం (సీపీఐ) తదితరులు ఉన్నారు. సభ్యుల సస్పెన్షన్ అవాంఛితం, అప్రజాస్వామికమని విపక్షాలు సంయుక్త ప్రకటనలో ధ్వజమెత్తాయి. సస్పెన్షన్లపై చర్చకు మంగళవారం విపక్షాలు అత్యవసరంగా భేటీ కానున్నాయి. సభను, సభాపతి స్థానాన్ని తీవ్రంగా అవమానించేలా ప్రవర్తించడం వల్లనే సభ్యులు సస్పెండయ్యారని ప్రభుత్వం సమర్థించుకుంది. ఆగస్టు 11న ఈ సభ్యులు అన్ని పరిధులు అతిక్రమించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ మేరకు ఆయన వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. టేబుళ్లపై నిల్చోవడం, సభాపతి పీఠంవైపు దస్త్రాలు విసరడం, పార్లమెంటరీ సిబ్బందిని అడ్డుకోవడం, మరికొన్ని హింసాత్మక ఘటనల ద్వారా ప్రజాస్వామ్యానికే వారు మచ్చ తెచ్చారని దానిలో పేర్కొన్నారు. ఛైర్మన్కు వారు క్షమాపణ చెబితే సస్పెన్షన్లు ఎత్తివేసే అవకాశం ఉంటుందని చెప్పారు. 256వ నిబంధన కింద గతంలోనూ కొందరు ఎంపీల్ని సస్పెండ్ చేసినా, ఒకేసారి 12 మందిపై చర్య తీసుకోవడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు.
రద్దు బిల్లు.. 750 మంది రైతులకు నివాళి
ఇది కర్షక విజయం: టికాయిత్
ఇతర డిమాండ్లపై నేటిలోగా స్పందించాలి: ఎస్కేఎం
దిల్లీ: నూతన సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేయడం.. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 750 మందికి నివాళి అని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధర సహా వివిధ అంశాలపై చర్చ జరిగేవరకు తాము ఉద్యమ వేదికను వీడబోమని చెప్పారు. చట్టాల రద్దును పార్లమెంటు ఆమోదించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. చట్టాలను రద్దు చేయడం నిరసనకారుల విజయమని ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) పేర్కొంది. తాము లేవనెత్తుతున్న డిమాండ్లపై ప్రభుత్వం మంగళవారంలోగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. తదుపరి కార్యాచరణ నిర్ణయించడానికి బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఎస్కేఎం నేతలు సోమవారం సింఘు సరిహద్దు వద్ద విలేకరులతో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. -
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం