Hero Electric-Mahindra: మహీంద్రా ప్లాంట్లో హీరో ఎలక్ట్రిక్ బైక్ల తయారీ
ప్రముఖ వాహన తయారీ సంస్థలు హీరో ఎలక్ట్రిక్, మహీంద్రా గ్రూప్.. విద్యుత్తు వాహనాల తయారీ కోసం చేతులు కలిపాయి.....
దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థలు హీరో ఎలక్ట్రిక్ (Hero Electric), మహీంద్రా గ్రూప్ (Mahindra Group).. విద్యుత్తు వాహనాల (EV) తయారీ కోసం చేతులు కలిపాయి. ఈ మేరకు ఇరు సంస్థలు ఓ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకొన్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా మహీంద్రా గ్రూప్ తయారీ కేంద్రంలో హీరో ఎలక్ట్రిక్ బైక్లు తయారు కానున్నాయి. మధ్యప్రదేశ్లోని పీథంపూర్లో ఉన్న మహీంద్రా ప్లాంట్లో హీరో ఎలక్ట్రిక్కు చెందిన ఆప్టిమా, ఎన్వైఎక్స్ బైక్లు తయారు కానున్నాయి. మార్కెట్లో ఈవీలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరు సంస్థలు ప్రకటించాయి.
దీంతో 2022 పూర్తయ్యే నాటికి ఏటా 1 మిలియన్ విద్యుత్తు వాహనాల తయారీ సామర్థ్యాన్ని అందుకోవాలన్న తమ లక్ష్యం నెరవేరనుందని హీరో ఎలక్ట్రిక్ ప్రకటించింది. లుథియానాలోని తమ తయారీ కేంద్రం సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..