SBI Services: ఎస్బీఐ అలర్ట్.. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
ఎస్బీఐకి చెందిన ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు శనివారం (జనవరి 22) కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఈ
ఇంటర్నెట్ డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State bank of India- SBI) వినియోగదారులకు ముఖ్య గమనిక. ఎస్బీఐకి చెందిన ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు శనివారం (జనవరి 22) కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆ బ్యాంక్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘టెక్నాలజీ అప్గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా జనవరి 22 ఉదయం 2 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ సేవలు పనిచేయవు’’ అని ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది.
గతేడాది డిసెంబర్ నెలలో సైతం ఇదే తరహాలో టెక్నాలజీ అప్గ్రేడేషన్ ప్రక్రియను ఎస్బీఐ చేపట్టింది. కాగా.. అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా 22 వేల శాఖలు, 57,889 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. మెట్రో నగరాల నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్రజలకు సేవలందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!