కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ లాభం రెట్టింపు

కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ మార్చి త్రైమాసికానికి రూ.213.47 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.104.37 కోట్లతో పోలిస్తే, ఇది రెట్టింపు కంటే అధికం. ఇదే సమయంలో

Published : 21 May 2022 02:36 IST

దిల్లీ: కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ మార్చి త్రైమాసికానికి రూ.213.47 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.104.37 కోట్లతో పోలిస్తే, ఇది రెట్టింపు కంటే అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.1518.39 కోట్ల నుంచి 6.3 శాతం పెరిగి రూ.1614.75 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం 4.4 శాతం అధికంగా రూ.1409.27 కోట్లకు చేరినట్లు బ్యాంక్‌ ప్రకటించింది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికరలాభం రూ.673.27 కోట్లకు చేరింది. 2020-21లో నమోదైన రూ.359.39 కోట్ల కంటే ఇది 87.3 శాతం ఎక్కువ. ఇదే సమయంలో ఆదాయం రూ.6389.25 కోట్ల నుంచి రూ.6356.73 కోట్లకు తగ్గింది. 2021-22కు ప్రతి షేరుకు రూ.1.60 చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని