SBI ALERT: ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. మరో ఫేక్ మెసేజ్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్. మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేశారని మరో ఫేక్ మెసేజ్ తాజాగా
దిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్. మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేశారని మరో ఫేక్ మెసేజ్ తాజాగా సర్య్యూలేట్ అవుతోంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నకిలీ ఎస్ఎంఎస్లు, ఈమెయిల్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని సూచించింది. ఈ మేరకు వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని వెల్లడించింది. ఒకవేళ అటువంటి సందేశాలు మీకు వస్తే report.phishing@sbi.co.inకు నివేదించాలని కోరింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ఈ హెచ్చరికను షేర్ చేసింది.
అయితే, ఎస్బీఐ బ్యాకింగ్కు సంబంధించి ఫేక్ మెసేజ్లు సర్క్యూలేట్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలోనూ చాలా మంది ఎస్బీఐ కస్టమర్లకు.. KYC నిబంధనలను పాటించనందుకు తమ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మెసేజ్లు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ లింక్ ఇచ్చి KYCని అప్డేట్ చేయమని కేటుగాళ్లు కోరారు. ఈ నేపథ్యంలోనే ఖాతాదారులెవరూ నకిలీ సందేశాలతో వచ్చే లింక్లపై క్లిక్ చేయవద్దని ఎస్బీఐ అప్రమత్తం చేసంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!