Netflix: షార్ట్ఫిల్మ్ మేకర్లకు నెట్ఫ్లిక్స్ గుడ్న్యూస్.. ప్రతిభను చాటుకునే సదావకాశం!
షార్ట్ఫిల్మ్ రూపొందించడంలో అనుభవం ఉందా? మీ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాలనుకుంటున్నారా? అయితే, ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ అలాంటి వారికి సదావకాశం కల్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: షార్ట్ఫిల్మ్ రూపొందించడంలో అనుభవం ఉందా? మీ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నారా? అయితే, ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ అలాంటి వారికి సదావకాశం కల్పిస్తోంది. తర్వాతి తరం కథకులను అన్వేషించడంలో భాగంగా ‘టేక్ టెన్’ పేరిట షార్ట్ఫిల్మ్ వర్క్షాప్, పోటీని నిర్వహిస్తోంది. దేశ యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ‘టేక్ టెన్’కు ఎంపికైన వారు వర్క్షాప్నకు హాజరవ్వడమే కాకుండా 10వేల డాలర్లతో షార్ట్ఫిల్మ్ రూపొందించే అవకాశం దక్కనుంది. ఇలా రూపొందించిన షార్ట్ఫిల్మ్లను నెట్ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానెల్లో ఉంచనున్నారు.
18 ఏళ్లు నిండిన భారత పౌరులు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. పోటీలో పాల్గొనాలంటే ‘మై ఇండియా’ అంశంపై రెండు నిమిషాల నిడివి గల షార్ట్ఫిల్మ్ను రూపొందించి నెట్ఫ్లిక్స్కు పంపాల్సి ఉంటుంది. అది కూడా మొబైల్తో తీసి ఉండాలి. ఫిబ్రవరి 7 నుంచి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోటీకి ఎంపికైన వారు రైటింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ వంటి విభాగాల గురించి నేర్చుకునే అవకాశాన్ని పొందొచ్చని నెట్ఫ్లిక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతిభ ఉన్నా వెలుగులోకి రాని వారి కోసం ఈ కార్యక్రమాన్ని నెట్ఫ్లిక్స్ చేపడుతోంది. ఇందుకోసం ఏడాదికి 100 మిలియన్ డాలర్ల చొప్పున రాబోయే ఐదేళ్ల చొప్పున దీని కింద ఖర్చు చేయనుంది. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికుల కోసమే ‘టేక్ టెన్’కు శ్రీకారం చుట్టినట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్