ట్రక్కు బోల్తా.. 10మంది జవాన్లకు గాయాలు

ఝార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లతో వెళుతున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ  ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా...

Published : 31 Oct 2020 00:58 IST

గిరిధ్‌: ఝార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రోడ్డుపై పశువులు అడ్డంగా రావడంతో వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం సంభవించింది.

సీఆర్పీఎఫ్‌ 154వ బెటాలియన్‌కు చెందిన 25 మంది జవాన్లను మదుబన్‌ నుంచి నిమియా ఘాట్‌కు తరలిస్తుండగా మదుబన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనానికి పశువుల గుంపు అడ్డుగా రావడంతో వాటిని తప్పించేందుకు డ్రైవర్‌ యత్నించాడు. ఈ క్రమంలో వాహనం బోల్తా పడింది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఎయిర్‌లిఫ్ట్‌ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని