రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సాత్నా జిల్లాలో ఓ ట్రక్కు, కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు....

Updated : 09 Nov 2020 15:57 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాత్నా జిల్లాలో ఓ ట్రక్కు, కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పన్నా జిల్లాలో జరిగిన ఓ సంతాప సభకు హాజరై బొలేరో వాహనంలో తిరిగి వెళ్తుండగా రెవా పట్టణంలోని ఓ మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు వారు ప్రయాణిస్తున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. క్షతగాత్రులను రెవాలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని