అఫ్గానిస్థాన్‌లో ఏడుగురు ఉగ్రవాదుల హతం!

అఫ్గానిస్థాన్‌లోని గజ్నీ నగరంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడికి ఆ దేశ భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ఆ ఆత్మాహుతి దాడికి కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న హంజా వజిరిస్థానీ సహా ఏడుగురు ఉగ్రవాదుల్ని అఫ్గన్‌ దళాలు సోమవారం మట్టుబెట్టాయి.

Published : 30 Nov 2020 17:46 IST

ఘజనీ: అఫ్గానిస్థాన్‌లోని ఘజనీ నగరంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడికి ఆ దేశ భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ఆ ఆత్మాహుతి దాడికి కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న హంజా వజిరిస్థానీ సహా ఏడుగురు ఉగ్రవాదుల్ని అఫ్గాన్‌ దళాలు సోమవారం మట్టుబెట్టాయి. ఈ మేరకు అఫ్గాన్‌ రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మిలిటరీ ప్రతినిధి ఫవద్‌ అమన్‌ మాట్లాడుతూ.. ‘వైమానిక దళ ఆపరేషన్‌లో అఫ్గాన్‌ భద్రతా దళాలు ఏడుగురు ఉగ్రవాదులను హతం చేశాయి. వారిలో ఆదివారం ఘజనీ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న హంజా వజిరిస్థాని కూడా ఉన్నాడు’ అని ఆయన వెల్లడించారు.

అఫ్గానిస్థాన్‌లోని ఘజనీ నగరంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. కారులో భారీ పేలుడు పదార్థాలతో వచ్చిన ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ దాడిలో 31 మంది భద్రతా సిబ్బంది మరణించారు. కాగా మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా అఫ్గాన్‌ నుంచి విదేశీ బలగాలను వెనక్కి తీసుకునే విషయమై అమెరికాతో ఒప్పందం జరిగినప్పటి నుంచి భద్రతా దళాలే లక్ష్యంగా తాలిబన్లు దాడులకు తెగబడుతుండటం గమనార్హం.

ఇదీ చదవండి

అఫ్గాన్‌లో బాంబు దాడి.. 31 మంది మృతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని