మైనర్ చెల్లికి డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన ఓ ఘటన షాక్కు గురిచేస్తోంది. డబ్బుకు ఆశపడిన ఓ అక్క మైనర్ అయిన తన చెల్లికి డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....
ఆరుగురి అరెస్టు చేసిన పోలీసులు
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన ఓ ఘటన షాక్కు గురిచేస్తోంది. డబ్బుకు ఆశపడిన ఓ అక్క మైనర్ అయిన తన చెల్లికి డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు తెలియజేయడంతో అక్కతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. భోపాల్కు చెందిన 15 ఏళ్ల బాలిక డ్రగ్స్కు బానిసవ్వడంతో కౌన్సిలింగ్ కోసం తల్లి ఆమెను ఎన్జీఓలో చేర్పించింది. అయితే సదరు బాలిక నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడించింది. రెండేళ్ల క్రితమే తన సోదరి(20) తనకు మాదకద్రవ్యాలు అలవాటు చేసిందని, డ్రగ్స్ ఇచ్చి తనతో వ్యభిచారం చేయించిందని వెల్లడించింది. ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులతో ఆరుసార్లు తనను పంపించిందని పేర్కొంది. దీంతో బాలిక తల్లి గాంధీనగర్ పోలీసులను ఆశ్రయించింది.పోక్సో చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొదట అక్కను అరెస్టు చేసి విచారించారు. ఆమె అందించిన సమాచారంతో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా