విద్యార్థులకు విషమిచ్చిన ఉపాధ్యాయురాలికి ఉరిశిక్ష
విద్యార్థులకు విషమిచ్చి ఒకరి చావుకు కారణమైన..
జీజింగ్: 25 మంది విద్యార్థులకు విషమిచ్చి ఒకరి చావుకు కారణమైన ఓ ప్రాథమిక ఉపాధ్యాయురాలికి చైనా కోర్టు మరణశిక్ష విధించింది. ఆమె చేసిన పనిని నీచమైన చర్యగా అభివర్ణిస్తూ కోర్టు ఉరిశిక్ష విధించినట్లు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఓ విద్యార్థి చావుకు కారణమైన నిందితురాలికి కఠినమైన శిక్ష విధించాలని నిర్ణయించినట్లు హెనాన్ ప్రోవిన్స్కు చెందిన కోర్టు స్పష్టం చేసింది. విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై గతేడాది జియాజూలోని ఓ ప్రాథమిక పాఠశాలలోని ఇద్దరు టీచర్ల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తురాలైన టీచర్ వాంగ్ తోటి పాధ్యాయురాలి మీద ఉన్న పగను విద్యార్థుల మీద తీర్చుకుంది. వారికి విషమిచ్చింది. పాఠశాలలో విద్యార్థులకు అందించే గంజిలో విషపూరితమైన రసాయనాన్ని కలిపింది. అది తాగిన 25 మంది వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ విద్యార్థి మృతిచెందాడు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాంగ్ను నిందితురాలిగా గుర్తించారు.
ఉపాధ్యాయురాలితో గొడవ జరిగిన అనంతరం వాంగ్ ఆన్లైన్లో నైట్రేట్ (విష పదార్థం) ఆర్డర్ చేసి దానిని పాఠశాలకు తీసుకొచ్చి గంజిలో కలిపినట్లు ఆధారాలు సేకరించారు. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష విధించింది. నిందితురాలు గతంలోనూ భర్తపై ఇలాంటి దారుణానికే ఒడిగట్టింది. 2017 ఫిబ్రవరిలో భర్త తాగే గ్లాసులో నైట్రేట్ కలిపింది. అయితే అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్