తుప్పల్లో శవమై తేలిన కరోనా రోగి
ఆసుపత్రి నుంచి పారిపోయిన ఓ కరోనా రోగి అనుమానాస్పద రీతిలో శవమై తేలాడు. 57 ఏళ్ల బాధితుడు..
ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని రోగి బంధువుల ఆరోపణ
ప్రయాగ్రాజ్: ఆసుపత్రి నుంచి పారిపోయిన ఓ కరోనా రోగి అనుమానాస్పద రీతిలో శవమై తేలాడు. 57 ఏళ్ల బాధితుడు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో చోటుచేసుకుంది. ఆసుపత్రికి 500 మీటర్ల సమీపంలోని పొదల్లో అతడి మృతదేహం లభ్యమైంది. రోగి ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో కరోనాకు చికిత్స అందిస్తున్న ప్రయాగ్రాజ్లోని స్వరూప్రాణి నెహ్రూ (ఎస్ఆర్ఎన్) ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం సదరు రోగిని చేర్పించారు. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతడు ఆసుపత్రి వార్డు గేటు నుంచి బయటకు రావడం అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యింది.
ఆసుపత్రి సిబ్బంది వేధింపుల వల్లనే పారిపోయాడని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతోందని సిబ్బందికి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని మృతుడు వారి బంధువులతో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ‘రాత్రి నుంచి నోరంతా ఎండిపోతోంది. ఇదే విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి తెలిపినా ఎవరూ పట్టించుకోలేదు’ అని బాధితుడు అందులో పేర్కొన్నాడు. ఆ ఆడియో క్లిప్ నిన్న బయటకు వచ్చింది. కాగా మృతుడి బంధువుల ఆరోపణలను ఆసుపత్రి వర్గం ఖండించింది. ‘సదరు రోగి జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స అందిస్తుండటంతో అతడి ఆరోగ్యం కుదుటపడుతోంది. కానీ అతడు ఎందుకు పారిపోయాడో తెలియడం లేదు. అతడిని ఆపేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే వెళ్లిపోయాడు. సిబ్బంది అతడిని వెంబడించినా లాభం లేకుండా పోయింది. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపాం’ అని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రి ప్రిన్సిపల్ డా.ఎస్పీ సింగ్ వెల్లడించారు.
పీపీఈ కిట్లు ధరించిన ఆరోగ్య కార్యకర్తలు ఆదివారం సాయంత్రం పొదల్లో నుంచి ఓ మృతదేహాన్ని బయటకు తీసుకువస్తున్న ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ ప్రాంతం ఆసుపత్రికి 500 మీటర్ల దూరంలోనే ఉంది. ‘మా తండ్రి ఇక లేరు. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లనే మా నాన్న చనిపోయారు. ఆసుపత్రిలోని రోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు’ అని మృతుడి కుమార్తె ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!