హత్యకు కారణమైన లౌడ్మ్యూజిక్
ఎక్కువ శబ్దం వినిపించేలా పెట్టిన మ్యూజిక్ గొడవకు దారితీసి ఒకరి హత్యకు కారణమైన ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దిల్లీలోని భథోలా ప్రాంతంలో నివాసం ఉండే అన్నాదమ్ములు సుశిల్, సునిల్, అనిల్ తమ ఇంటి పక్కన
న్యూదిల్లీ: ఎక్కువ శబ్దం వినిపించేలా పెట్టిన మ్యూజిక్ గొడవకు దారితీసి ఒకరి హత్యకు కారణమైన ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దిల్లీలోని భథోలా ప్రాంతంలో నివాసముండే అన్నదమ్ములు సుశీల్, సునీల్, అనీల్ తమ ఇంటి పక్కన ఉండే సత్తార్ అనే వ్యక్తి లౌడ్మ్యూజిక్ విషయమై అతనితో వాగ్వాదానికి దిగారు. సౌండ్ తగ్గించమని చెప్పినా సత్తార్ నిరాకరించడంతో గొడవ పెద్దదైంది. కత్తులతో దాడి చేసుకునే వరకూ వచ్చింది. ఈ ఘర్షణలో సత్తార్ అతని ఇద్దరి కొడుకులను సుశీల్, సునీల్, అనీల్ను పలుమార్లు కత్తితో పొడిచారు.
తీవ్రంగా గాయపడిన ఈ ముగ్గురిని కుటుంబ సభ్యులు దిల్లీలోని బాబు జగ్జీవన్రామ్ ఆసుప్రతికి తీసుకెళ్లారు. వీరిలో సుశీల్ మార్గం మధ్యలోనే మృతిచెందారు. అనిల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ గొడవలో సత్తార్ భార్య షాజహాన్ సైతం గాయపడ్డారు.
బాధితుడు సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సత్తార్తో పాటు అతని ఇద్దరు కొడుకులను అరెస్టు చేశారు. దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే బాధిత కుటుంబాన్ని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బుధవారం పరామర్శించారు. న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్తో మాట్లాడి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?