హాథ్రస్ ఘటనలో మనీలాండరింగ్ కోణం!
హాథ్రస్ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో అంతర్జాతీయ సంస్థల ప్రమేయంపై ఆరా మొదలైంది.
అంతర్జాతీయ కుట్రపై ఈడీ ఆరా
దిల్లీ: హాథ్రస్ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో అంతర్జాతీయ సంస్థల ప్రమేయంపై ఆరా మొదలైంది. ‘కుల ఆధారిత హింసను ప్రేరేపించడానికి కొన్ని సంస్థల నుంచి నిధులు సమకూర్చడం’ వంటి ఆరోపణలు రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. ఆ దర్యాప్తు సంస్థ సన్నిహిత వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..ఉత్తర్ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించిన ఆరోపణలను ఈడీ పరిశీలిస్తోందని, దర్యాప్తు చేసి, మనీ లాండరింగ్ కేసు నమోదుచేయొచ్చని వారు తెలిపారు. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్రం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే అంతర్జాతీయ కుట్ర గురించి యూపీ పోలీసులు సూచించినందున ఎన్జీఓ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కు ఉన్న సంబంధంపై ఈడీ దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.
కాగా, 51 కోట్ల రూపాయాల ఎగుమతి ఆదాయాన్ని పొందారన్న ఆరోపణలతో ఆమ్నెస్టీతో సంబంధం ఉన్న ఒక ప్రైవేటు సంస్థపై ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు గతవారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, కొద్ది రోజుల క్రితం భారత్లో తన కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఈ మానవ హక్కుల సంస్థ కూడా ప్రకటన చేసింది. ప్రభుత్వం తమ ఖాతాలను స్తంభింపజేసిందని, ఎటువంటి ఆధారాలు లేకుండానే తమను వేటాడుతోందని భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇదిలా ఉండగా, దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసిన హాథ్రస్ ఘటనలో దేశద్రోహం, కుల ఆధారిత కుట్రలకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ