హాథ్రస్ కేసు వాదించనున్న నిర్భయ న్యాయవాది
నిర్భయ కేసును వాదించి గెలిపించిన మహిళా న్యాయవాది సీమా ఖుష్వాహా.. హాథ్రస్ బాధితురాలి కేసునూ వాదించనున్నట్టు తెలిసింది.
ఆ కుటుంబాన్ని కలిసేందుకు అనుమతించటం లేదు: సీమా కుష్వాహా
హాథ్రస్: నిర్భయ కేసును వాదించి గెలిపించిన ప్రముఖ మహిళా న్యాయవాది సీమా కుష్వాహా.. హాథ్రస్ బాధితురాలి కేసునూ వాదించనున్నట్టు సమాచారం. కాగా, సీమ గురువారం బాధితురాలి కుటుంబాన్ని కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఆమెను పోలీసులు దారిలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘వారి తరఫున నిలబడి న్యాయం చేయాల్సిందిగా బాధితురాలి కుటుంబ సభ్యులు నన్ను కోరారు. అయితే అధికార యంత్రాంగం వారిని కలిసేందుకు అనుమతించటం లేదు. కానీ ఆ కుటుంబాన్ని కలవకుండా నేను తిరిగి వెళ్లేది లేదు’’ అని మీడియాతో అన్నారు. బాధితురాలి సోదరుడితో తాను సంప్రదింపులు జరుపుతున్నాని ఆమె తెలిపారు.
డిసెంబర్ 16, 2012న దిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఘటనలో సీమా కుష్వాహా బాధితురాలి తరఫున వాదించి ఆ కేసును గెలిపించారు. ఇక హాథ్రస్ ఘటనలో 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు దాడికి పాల్పడ్డారు. బాధిత యువతి దిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో ప్రభుత్వం ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఆమెపై అత్యాచారం జరిగినట్టు పోస్ట్మార్టం నివేదికలో నిర్ధారణ కాలేదని అదనపు డైరక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఆరెస్టు చేసినట్టు ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.