క్షణాల్లో లక్షలు లూఠీ!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌లో జరిగిన ఓ చోరీ ఉదంతమిది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటనలో లక్షల రూపాయల నగదును లూఠీ చేశారు దుండగులు. అది కూడా క్షణాల వ్యవధిలోనే. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన గిడ్డంగిలో.......

Published : 02 Nov 2020 00:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌లో జరిగిన ఓ చోరీ ఉదంతమిది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటనలో లక్షల రూపాయల నగదును లూఠీ చేశారు దుండగులు. అది కూడా క్షణాల వ్యవధిలోనే. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన గిడ్డంగిలో ఈ దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి పదిగంటలకు గిడ్డంగిలోని ఉద్యోగులు నగదు లెక్కిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి అయిదుగురు దుండగులు తుపాకులు పట్టుకొచ్చారు. ఉద్యోగులను బెదిరించి రూ.లక్షల్లో నగదు ఉన్న డబ్బాను అమాంతం ఎత్తుకెళ్లారు. ఇదంతా కేవలం 18 సెకన్లలో జరిగింది. చోరీ జరిగిన తీరు మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు గిడ్డంగి ఇంఛార్జి అనుమూల్ కశ్యప్‌ తెలిపారు. అయితే దుండగులు దోచుకెళ్లిన నగదు ఎంతన్నది ఇంకా తెలియరాలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని