అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
40 కిలోల గంజాయి స్వాధీనం
నెహ్రూ సెంటర్: నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. జిల్లా పరిధిలోని కేసముద్రం మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై సతీష్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వరంగల్ వైపు వెళ్తున్న కారును ఆపి పోలీసులు తనిఖీ చేయగా.. అందులో 40 కిలోల నిషేధిత ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దాని విలువ దాదాపు రూ.4లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా వేశారు. కారులో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన కలిమేగి గ్రామానికి చెందిన శివశంకర్, మదకమిదుల, సరకార్ స్వప్నను పోలీసులు అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురూ ఒడిశాలో ఎండు గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు ఎస్పీ తెలిపారు.
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ఎవరూ చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదని ఎస్పీ కోటిరెడ్డి హచ్చరించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని చెప్పారు. అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చాకచక్యంగా వ్యవహరించి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్న కేసముద్రం ఎస్సై సతీష్, రూరల్ సీఐ వెంకటరత్నం, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)