పాతబస్తీ హుస్సేనీ ఆలంలో విషాదం

నగరంలోని పాతబస్తీ ప్రాంతంలోని హుస్సేనీ ఆలంలో విషాదం చోటుచేసుకుంది. పాతరేకుల ఇల్లు కూలి..

Published : 12 Oct 2020 00:59 IST

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీ ప్రాంతంలోని హుస్సేనీ ఆలంలో విషాదం చోటుచేసుకుంది. పాతరేకుల ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురిని ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనీస్‌ బేగం(18), ఫరా బేగం (22) మృతిచెందారు. గాయపడిన మహమ్మద్‌ఖాన్‌, పర్వీన్‌ బేగం, అంజాద్‌ ఖాన్‌, హసంఖాన్‌, హుస్సేన్‌ఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వర్షానికే రేకుల ఇల్లు కూలినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని