భార్యపై అనుమానం.. భర్త కిరాతకం
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసింది. ఆ రాష్ర్టంలోని బందా జిల్లాలో కిన్నర్ యాదవ్, విమ్లా దంపతులు నివాసం
లఖ్నవూ: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది. ఆ రాష్ట్రంలోని బందా జిల్లాలో కిన్నర్ యాదవ్, విమ్లా దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన యాదవ్ తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ సమయానికి అతని భార్య పక్కింట్లో ఉండే ఎలక్ట్రీషియన్ రవికాంత్తో మాట్లాడుతుండగా చూశాడు. దీంతో భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఘర్షణ పెద్దదై విచక్షణ కోల్పోయిన యాదవ్ ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. విమ్లా తల నరికేశారు. రవికాంత్ను సైతం గాయపరిచాడు.
అనంతరం యాదవ్ భార్య తలతో పోలీసులకు వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య తరచూ ఇంటి పక్కన ఉండే రవికాంత్తో మాట్లాడుతుండేదని నిందితుడు పోలీసులకు చెప్పాడు. తన భార్యకు ఆ ఎలక్ట్రీషియన్తో వివాహేతర సంబంధం ఉందని యాదవ్ వారికిచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. ఆ కారణంతోనే భార్యను హత్య చేసినట్లు పోలీసులకు వివరించాడు. భార్యను హత్య చేసిన యాదవ్ ఆమె తలతో 2 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో స్థానికంగా వైరల్గా మారింది. స్థానిక పోలీసు స్టేషన్కు వెళ్లిన యాదవ్ నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా