ట్యాంక్‌బండ్‌పై యువకుడ్ని చితకబాదిన హిజ్రాలు

నగరంలోని ట్యాంక్‌బండ్‌పై యువకుడిని హిజ్రాలు చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 05 Sep 2020 02:04 IST

హైదరాబాద్‌: నగరంలోని ట్యాంక్‌బండ్‌పై యువకుడిని హిజ్రాలు చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 1న వినాయక నిమజ్జనం సమయంలో హిజ్రాలతో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. విసుగు చెందిన హిజ్రాలు అతడిపై దాడి చేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదు. దాడి దృశ్యాలు సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని