Crime News: శ్రీకాకుళంలో దారుణం.. ఇద్దరిని చంపి వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో ఓ వ్యక్తి ఇద్దరిని చంపి ఆపై ఆత్మహత్యకు యత్నించాడు.

Updated : 29 Jan 2022 09:07 IST

ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో ఓ వ్యక్తి ఇద్దరిని చంపి ఆపై ఆత్మహత్యకు యత్నించాడు. భార్య అప్పమ్మతో పాటు తన సోదరి రాజులును హత్య చేసిన వి.సి.అప్పన్న ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భార్యను చంపుతుండగా అడ్డొచ్చిన తన తండ్రితో పాటు సోదరి కుమార్తె పద్మను కూడా అప్పన్న గాయపరిచాడు.

మద్యం వద్దని వారించినందుకు అప్పన్న దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన వారితో పాటు అప్పన్న.. శ్రీకాకుళం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని