Crime News: సైదాబాద్‌ హత్యాచార ఘటన.. కామాంధుడిని పట్టిస్తే ₹10 లక్షల రివార్డ్

సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై హత్యాచర ఘటనలో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిందితుడ్ని పట్టించిన వారికి రూ.10లక్షలు రివార్డు ఇస్తామని ప్రకటించారు...

Updated : 09 Sep 2022 14:32 IST

హైదరాబాద్‌: సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై హత్యాచర ఘటనలో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిందితుడ్ని పట్టించిన వారికి రూ.10లక్షలు రివార్డు ఇస్తామని ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 94906 16366 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌ పోలీసులు ఇంత మొత్తంలో రివార్డు ప్రకటించిన దాఖలాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నాయి. అయినా, నిందితుడు రాజు ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు చూపుతూ పోలీసులు రివార్డు ప్రకటించారు. 

పోలీసులు తెలిపిన నిందితుడి ఆనవాళ్లివే... 

* నిందితుడి పేరు: పల్లకొండ రాజు, వయస్సు 30 సంవత్సరాలు
*  5.9 అడుగుల ఎత్తు
* టోపీ పెట్టుకొని ఎర్ర చేతిరుమాల ముఖానికి పెట్టుకున్నాడు.
* రెండు చేతులపైనా మౌనిక అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఫ్యాంట్‌, షర్ట్‌ ధరించి ఉన్నాడు.
మద్యం సేవించే అలవాటు ఉంది. మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పై ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని