మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో 13 మంది మరణించారు. మరో ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు.
భోపాల్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓల్డ్ చావ్ని ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో 12 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సును ఆటో అతి వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అంగన్ వాడీ కేంద్రంలో వంట చేసేవారు తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని గ్వాలియర్ ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు. ప్రమాద స్థలంలోనే 8మంది మహిళలు, ఆటో డ్రైవర్ మరణించగా...మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన వివరించారు. ప్రమాదం దాటికి ఆటో నుజ్జునుజ్జవ్వగా.. మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె