Army: పాక్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న సైన్యం..!
జమ్ముకశ్మీర్లోని ఉరి సెక్టార్లో భారత్ సైన్యం ఓ పాక్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకొంది. మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది. గత కొన్నేళ్లలో ఓ పాక్ ఉగ్రవాది భారత్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా సీజవంగా
పాక్ లాంఛ్ప్యాడ్ల వద్ద భారీ సంఖ్యలో ముష్కరులు
ఇంటర్నెట్డెస్క్: జమ్ముకశ్మీర్లోని ఉరి సెక్టార్లో భారత్ సైన్యం ఓ పాక్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకొంది. మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది. గత కొన్నేళ్లలో ఓ పాక్ ఉగ్రవాది భారత్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా సజీవంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. గత కొన్ని వారాలుగా ఉరి, రాంపూర్ సెక్టార్లలో పలు చోట్ల నుంచి ఉగ్రవాదులు దేశంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించగా.. సైన్యం వాటిని విఫలం చేసింది. గత వారం రాంపూర్ సెక్టార్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు.
కశ్మీర్ ముస్లింలను వాడుకొంటున్న పాక్ ఉగ్రవాదులు..
పాక్ ఉగ్రవాదుల వ్యూహాన్ని చినార్ కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే ఇటీవల వెల్లడించారు. గత కొన్నాళ్ల నుంచి పాక్వైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు తగ్గాయని చెప్పారు. ఇదే సమయంలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం కశ్మీర్ లోయలో దాదాపు 70 మంది వరకు పాక్ ఉగ్రవాదులు ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. వీరంతా నేరుగా దాడుల్లో పాల్గొనరని పాండే తెలిపారు. స్థానికంగా ఉన్న వారిని దాడుల్లో పాల్గొనేలా చేసి ప్రాణాలు పోగొట్టుకొనేలా రెచ్చగొడతారన్నారు. ఎన్కౌంటర్లలో స్థానికులు మరణిస్తే వారి కుటుంబాలు, బంధువులు, మిత్రులు సైన్యానికి వ్యతిరేకంగా మారతారన్నది పాక్ ఉగ్రవాదుల వ్యూహం.
‘పండుగ సీజన్ అలర్ట్’తో సైన్యం అప్రమత్తం..
భారత్లో పండుగ సీజన్ సందర్భంగా ఉగ్రదాడులు నిర్వహించేందుకు పాక్ యత్నాలు చేస్తున్నట్లు ఇటీవల ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్ మద్దతు ఉన్న 40 మంది అఫ్గాన్ ఉగ్రవాదులను ఇప్పటికే నియంత్రణ రేఖ వద్ద నక్యాల్ సెక్టార్లో సిద్ధంగా ఉంచినట్లు గుర్తించాయి. వీరందరిని పూంచ్ నదిలో నుంచి భారత్లోకి ప్రవేశపెట్టేందుకు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు లష్కరే తోయిబా, హర్కత్ ఉల్ అన్సార్, హిజ్బుల్ ముజాహుద్దీన్ వంటి సంస్థల కదలికలు కూడా పెరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్