కేరళలో దొంగల బీభత్సం

కేరళలో దొంగలు బీభత్సం సృష్టించారు. బైక్‌ మీద వచ్చిన దుండగులు రోడ్డు మీద నిలబడిన వ్యక్తి ఫోన్‌ను

Published : 03 Jul 2021 14:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళలో దొంగలు బీభత్సం సృష్టించారు. బైక్‌ మీద వచ్చిన దుండగులు రోడ్డు మీద నిలబడిన వ్యక్తి ఫోన్‌ను అపహరించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితుడిని రోడ్డు మీద కొంత దూరం ఈడ్చుకెళ్లారు.

వివరాల్లోకి వెళ్తే.. కోజికోడ్‌లో అలీ అనే కార్మికుడి నుంచి దుండగులు ఫోన్ మాట్లాడాలంటూ చరవాణి తీసుకున్నారు. అనంతరం అతని కళ్లుగప్పి ఫోన్‌తో ఉడాయించేందుకు ప్రయత్నించారు. అయితే దొంగలు వచ్చిన ద్విచక్రవాహనాన్ని అలీ వదలకుండా పట్టుకోగా అతణ్ని అలాగే ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో అలీ సహా ద్విచక్రవాహనం వెనక కూర్చున్న దొంగ కూడా కింద పడిపోయాడు. తర్వాత తేరుకున్న దొంగలు స్థానికులకు చిక్కకుండా పరారయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని