ఫోన్‌ కోసం కొవిడ్‌ రోగిని చంపేశారు!

డబ్బు, సెల్‌ఫోన్‌ కోసం కొవిడ్‌ రోగిని దారుణంగా హత్య చేసిన ఘటన చెన్నైలోని ఓ ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రిలో

Published : 17 Jun 2021 01:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డబ్బు, సెల్‌ఫోన్‌ కోసం కొవిడ్‌ రోగిని దారుణంగా హత్య చేసిన ఘటన చెన్నైలోని ఓ ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువొట్టియూర్‌కు చెందిన 40 ఏళ్ల రతీ దేవి చెన్నై ప్రభుత్వం ఆసుపత్రిలో ఒప్పంద ఉద్యోగినిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మే 23నే కొవిడ్‌ సోకిన సునీత అనే గృహిణి చికిత్స తీసుకోవడానికి అదే ఆసుపత్రిలో చేరారు. బాధితురాలి వద్ద నగదు చూసిన రతీదేవి తన అవసరాల నిమిత్తం వాటిని కాజేయాలనుకుంది. పక్కా ప్రణాళికతో సునీతను ఆసుపత్రి చివరి అంతస్థుకు తీసుకువెళ్లి కిరాతకంగా గొంతుకోసి హత్యచేసి, అమె దగ్గరున్న డబ్బు, సెల్‌ఫోన్‌ను కాజేసింది. జూన్‌ 8న జరిగిన ఈ హత్యపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్‌చేసి, అమె వద్ద నుంచి డబ్బు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని