రాళ్లు రువ్వి.. వెంబడించి

ఓ ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్న వ్యక్తులను పోలీసులు సినీ ఫక్కీలో స్థానికుల సాయంతో పట్టుకున్నారు. కర్ణాటకలోని చిక్‌మగళూర్‌కు చెందిన చంద్రగౌడ అనే వ్యక్తి ఇంట్లో నగలు, నగదు దొంగిలించి పారిపోతున్న ఇద్దరు దుండగులను....

Published : 01 Mar 2021 01:07 IST

బెంగళూరు: ఓ ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్న వ్యక్తులను పోలీసులు సినీ ఫక్కీలో స్థానికుల సాయంతో పట్టుకున్నారు. కర్ణాటకలోని చిక్‌మగళూర్‌కు చెందిన చంద్రగౌడ అనే వ్యక్తి ఇంట్లో నగలు, నగదు దొంగిలించి పారిపోతున్న ఇద్దరు దుండగులను గమనించిన స్థానికులు వారిని వెంబడించారు. వారిపై రాళ్లు విసిరారు. అయితే స్థానికులపై దాడి చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారు పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే వచ్చి స్థానికుల సాయంతో దొంగలను అరెస్టు చేశారు. నిందితులను సచిన్‌, మోహన్‌గా గుర్తించారు. అయితే చంద్రగౌడకు సచిన్‌ బంధువని పోలీసులు తెలిపారు. సచిన్‌కు, చంద్రగౌడకు మధ్య ఆస్తి విషయంలో గొడవలు ఉన్నాయని, ఈ క్రమంలోనే ప్రతీకారంతో దొంగతనం చేశాడని వెల్లడించారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని