కరోనాను జయించాడు.. కానీ ఆ భయమే చంపేసింది!
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ తగ్గుముఖం పడుతుండటం ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ.. కొన్నిచోట్ల నమోదవుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో 80 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అహ్మదాబాద్: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ తగ్గుముఖం పడుతుండటం ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ.. కొన్నిచోట్ల నమోదవుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో 80 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘80 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి అహ్మదాబాద్లోని పాల్దీ ప్రాంతంలోని అమన్ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నాడు. గురువారం సాయంత్రం తన అపార్ట్మెంట్లోని టెర్రాస్పైకి వెళ్లి పురుగుల మందు తాగడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలం క్రితం ఆ వృద్ధుడు కరోనా బారినపడి కోలుకున్నాడు. ఇటీవల నోటిలో పుండులా ఏర్పడటంతో బ్లాక్ఫంగస్ సోకిందేమోననే భయాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ సూసైడ్ నోటు రాసి పెట్టి, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా సోకినవారికి, అందులోనూ మధుమేహ వ్యాధిగ్రస్థులకు బ్లాక్ఫంగస్ ముప్పు పొంచి ఉండటంతో తనకూ ఈ వ్యాధి వచ్చిందేమోనన్న భయంతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. బ్లాక్ ఫంగస్కు చికిత్సతో పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని ఆ వృద్ధుడు భావించాడు. ఆ బాధను దృష్టిలో పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు.. కుటుంబ సభ్యుల స్టేట్మెంట్, అతడి సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేశాం. బాధితుడి ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ మానసికంగా ఆందోళనకు గురయ్యాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాం’’ అని పాల్దీ ఇన్స్పెక్టర్ జేఎం షోలంకి తెలిపారు.
కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాలని, అనవసర భయాలతో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
మహారాష్ట్రలోని కల్యాణ్లో ఓ రైలు ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు మరో కేసులోని డెత్ మిస్టరీని ఛేదించారు. -
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్