AP News: ట్రాక్టర్‌ రోటావేటర్‌లో పడి అన్నదాత దుర్మరణం

పొలంలో పని చేస్తుండగా ట్రాక్టర్‌ రోటావేటర్‌లో పడి ఓ రైతు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా దుర్గి గ్రామానికి చెందిన రైతు బండి వెంకటేశ్వర్లు (50) తన వ్యవసాయ భూమిని రోటావేటర్‌తో దున్నించేందుకు బుధవారం ఉదయం ట్రాక్టర్‌

Updated : 10 Jun 2021 07:38 IST

దుర్గి, న్యూస్‌టుడే: పొలంలో పని చేస్తుండగా ట్రాక్టర్‌ రోటావేటర్‌లో పడి ఓ రైతు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా దుర్గి గ్రామానికి చెందిన రైతు బండి వెంకటేశ్వర్లు (50) తన వ్యవసాయ భూమిని రోటావేటర్‌తో దున్నించేందుకు బుధవారం ఉదయం ట్రాక్టర్‌ డ్రైవర్‌తో కలిసి వెళ్లారు. పొలం దున్నే సమయంలో వెంకటేశ్వర్లు ట్రాక్టర్‌ ఎక్కబోయి.. జారి రోటావేటర్‌లో పడిపోయాడు. వేగంగా తిరుగుతున్న యంత్రంలోని బ్లేడ్లు వెంకటేశ్వర్లును లోనికి లాగేశాయి. డ్రైవర్‌ గమనించి, ట్రాక్టర్‌ ఆపే లోపే ఆయన అక్కడికక్కడే మరణించాడు. బయటికి తీసేందుకూ వీల్లేనంతగా శరీరం అందులో చిక్కుకుపోయింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని